126
(27) నవ్వాబ్ అబ్దుర్ జబ్బార్ ఖాన్ జమాదారు యొక్క యెస్టేటును విడుదల చేయు విషయమున విచారించుటకును,
రాజాబహద్దరు వేంకటరామా రెడ్డిగారిని శ్రీ ప్రభువు కారు ప్రత్యేకాధి కారములిచ్చి కమిషనర్ గా ఏర్పాటు చేసిరి.
(28) యువరాజులు యూరోపులో వివాహితులై నగరము వచ్చినప్పుడు వారిని గౌరవించుటకు ఆహ్వాన సంఘ మేర్చడెను. దాని అధ్యక్షులుగా' ఫర్మానుద్వారా రెడ్డిగారు నియక్తులైరి.
(29 ) ప్రభువు గారి సిల్వర్ జూబిలీ మహోత్సవకాల మందు రెడ్డిగారుచేసిన కృషి, ఆపారముగా నుండెను.
(30) ప్రభువుగారు డిల్లీ నుండి తిరిగివచ్చినప్పుడు నగరములో అపూర్వమైన వేడుకలు కావింపబడెను. ఆ సందర్భమునందును రెడ్డిగారే ముఖ్య బ్యాత :హించినవారై యుండిరి,
(31) రెడ్డిగారికి స్కౌటింగులో (బాలభటః ర్గములో) చాల అభిమావము. రెడ్డి హాస్టలులోని 150 మంది విద్యా ర్డులలో నించు మించు 50-60 మంది విద్యార్థులు వీరిప్రోద్బలము చేతనే స్కౌటింగులోచేరి" రెడ్డి ట్రూవు" అను పేరుతో ఒక సంఘముగా నేర్పడినారు. వీరికి డెస్సును తామే తెప్పించి