పుట:Venkata Ramareddy Jeevita Charitra Pratapa Reddy 1891.pdf/106

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

83


నులతో ఫలాని వాడు దొంగ వానిని పట్టుకొనుడు అని యాజ్ఞు పించి ముందు సాగిపోయెడి వారు. ఈ ప్రకారముగా వారు ఇల్లు చేరుకొను వరకు కొంతమందిని త్రాళ్ల తో గట్టి జవాను లీడ్చుకొని వచ్చెడివారు. ఆ నిర్బంధితులు తమ తప్పులన్నిం టిని ఒప్పుకొస్న ఆ ర్వాత వారిని జెయిళ్లలో వేయుచుండిరి!!


ఆ కాలములో ఉత్తరమునను, మధ్య హిందూ స్థానముసను వ్యాపించినట్టి థగ్గులు హైద్రాబాదు రాజ్యము లోను వ్యాపించుకొని యుండిరి. నిజామాబాదులోని సీర్నపల్లి ప్రాంతములలో గుట్టలును, దట్టమగు అడవులును నిప్పటికిని కలవు. అందు విశేషముగా ఈ థగ్గుల ఘోరములు జరుగుచుండెను. మరియు హైదరాబాదు నగర సమీపములో, నుఁడిన ఆసఫ్ నగరు గుట్టవద్ద నొక దేవాలయ ముండెను. అది గోసాయీల యొక్కయు, ఫకీ రుల యొక్కయు; సన్యాసుల యొక్కయు ఆశ్రయమై యుండెను. వారు వేషధారులైన దొంగలుగా నుండిరి. థగ్గుబు తాము దోచిన ధనమును ఈ సన్యానుల కమ్ముచుండిరి. లక్షలకొలది విలువగల సొమ్ములు, ముత్యములు, వజ్రములు వీరివద్ద దాచియుంచ బడుచుండెను.


నగర కొత్వాలుల చరిత్రలో నవాబ్ అక్బర్ జంగు కొత్వాలుగారి కాలపు చరిత్రయు చాల వినోదకరముగా నున్నది. అక్బర్ జంగు గారు 1293 ఫసలీ లో