వేమన 28
యూహ. కావుననే -
"ఆ. పరఁగరాయని కులబాచని ధనమెల్ల
భటులపాలు కవుల పాలు తలప,
ఒనర హీనజనుని ధనము దాయాదుల
పాలు జారకాంతపాలు వేమ" (24-22) ♦[1]
అను పద్యమును వేమన 14-వ శతాబ్దము తుదలోనున్న రాయని భాస్కరునిగూర్చియే వ్రాసెనని తల(చిరి. మఱియు
"శ్లో|| నిర్మాయ నూతన ముదాహరణానురూపం
కావ్యం మాయాత్రనిహితం నపరస్యకించిత్
కింసేవ్య తే సుమనసాం మనసాపి గస్థః
కస్తూరికా జననశక్తిమతామృగేణ" (రసగంగాధరము) *[2]
యని స్వాభిమానపూర్ణుడై చెప్పిన పండితరాయఁడు---
'ఆ, ప్రస్తుంతబు వేళ పద్యంబు చదివిన
తప్పలెన్నియున్న నొప్పియుండు ----" (26-38)
అను వేమన్న పద్యమునే
"అపసరపలితావcచీ గుణగణరహితాపి పహతి పరమోదమ్"
అన్నట్లు సంస్కృతమున భాషాంతరీకరించుకొనియెసని చెప్పిరి !**[3] ఇంతేకాక
క, భవదూరు(డు శరభాంకు (డు
శివనీలుఁడు చేయు(గోటి సిద్దేశ్వరుఁన్
శివభృత్యుఁడు వటమాలుఁడు
శివమయ చిన్మయుఁడు సోమశేఖర గురుఁడుస్"
(ఓ. లై., 12-1-35)
ఆను వేమన పదములలోని యొుకానొక పద్యమున వేమన్నకు గురువుగాఁ జెప్పఁబడిన సోమశేఖరుఁడును, వీరభద్రవిజయముస బమ్నెర పోతన్న తన గురువుగాఁ జెప్పుకొన్న 'ఇవ్వటూరి సోమవిభుఁడును" ఒకరేయని తలఁచి పోతన్న వేమన్న లిరువురును సహాధ్యాయులై యుండవచ్చునని లూహను సాఁగఁదీసిరి !
కాని వీరి యీ కాలనిర్ణయం నెవ్వరును అంగీకరింపలేదు. భంగారుతమ్మయ్యగారు, శ్రీ ప్రభాకరశాస్త్రులుగారు దీనిని సయుక్తికంగా ఖండించిరి.†[4] పై రాయని భాస్కరుని పద్యమునకు పెక్కు వ్రాతప్రతులలోను అచ్చుప్రతులలోను ఈ పద్యం గలదు.
- ↑ ♦ ఈ ప్రతిలో 'రాజకులులు పాతినధనము' అని పాఠము గలదు. కాని, ధ్రాంతి, వ్రాఁత ప్రతులలోను, ప్రాఁతప్రతులలోను 'దాచని ధనము' 'బాచన్న ధనము' అనియే కలదు. 'బాచున్న' యను పాఠమును గలదు. అదియు పొరఁబాటే. ముందు చూడుము.
- ↑ * ఉదాహరింపఁదగిన వానినెల్ల నేనిందు కొత్తగా రచించితిని గాని యితరుల పద్యము లిందేమియు జేర్చలేదు. కస్తూరిని బట్టింపఁగల మృగము పువుల వాసన మనసున నైనఁ దలఁచునా ? అని తా.
- ↑ ** వం. సు. వేమన. పు. 124.
- ↑ † చూ, ఆంధ్రపత్రిక, రక్తాక్షి, క్రోధన, అక్షయ సంవత్సరపుల సంచికలు.