పత్రిక శ్రీ శ్రీపాద కృష్ణమూర్తిశాస్త్రిగారి సంపాదకత్వమున రాజమహేంద్రవరము నుండి వెలువడుచుండెను.
ఇక్కాలమున శ్రీ పూండ్ల రామకృష్ణయ్యగారికిని శ్రీ కొక్కొండ వేంకటరత్మము పంతులవారికిని బిల్వేశ్వరీయమను గ్రంథము విషయమై వివాద మేర్పడినది దీనింగూర్చి శ్రీ పూండ్ల రామకృష్ణయ్యగారే ప్రకటించిన వ్యాసమునుండి కొంత యుదాహరించుట మంచిది:-
- "శ్రీ బిల్వేశ్వరీయకృతి విమర్శనముంగుఱించి- ఈసంవత్సరము మార్చినెల మొదలుగ మేము విమర్శించుచున్న శ్రీ బిల్వేశ్వరీయముంగూర్చి వివిథాభిప్రాయము లితరులచే బ్రకటింపబడినవి. వానికిం బ్రత్యుత్తరముగ నియ్యుపన్యాసముం బ్రకటించుచున్నారము:-
బ్రహ్మశ్రీ, మహారాజశ్రీ శ్రీమత్కొక్కొండ వేంకటరత్నము పంతులవారు సంస్కృతాంధ్రములయం దసమానపాండిత్యముగల వారనుట జగద్విదితమైన యంశము. అట్టి పండితునిచే విరచింపబడిన గ్రంథమును విమర్శించుట పండితులకు విధియైయున్నది. శ్రీ పంతులవారే తమ గ్రంథమును విమర్శనార్థమై 18-9-93 న, మా కార్యస్థానమునకు బంపియున్నారు. గ్రంథమును సాంతముగ జదువగా గుణములతో బాటు గొన్నిదోషము లగపడి నందున మావిమర్శనయంతయు ఒకగ్రంథముగ వ్రాసి ప్రక
_____________________________________________________
- అముద్రిత గ్రంథచింతామణి సం. 7 సంచి. 12.