పుట:Vedhamu Venkataraya Shastrula Vari Jeevitha Charitra Sangrahamu.pdf/83

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

8-ప్రకరణము

పాత్రోచితభాష

ఆంధ్రవాఙ్మయమున పూర్వకవు లెవరును నాటకములు వ్రాయలేదు. నాటకములు వ్రాయవలయునను బుద్ధి మనకు ఇంగ్లీషుభాషా సహవాసానంతరము వచ్చినది. ఈవిషయమును గుఱించి గ్రామ్యభాషాప్రయోగ నిబంధన మను నుపన్యాసమున శాస్త్రులవా రిట్లు వ్రాసియున్నారు-

"మనవారు మేకదాటుగా చిరకాలము పురాణముల నాంధ్రీకరించి తర్వాతం బ్రబంధంబుల విసిగి యిపుడు అన్యములం దొడంగినారు. మఱియు గీర్వాణనాటకముల నెఱింగియు హూణనాటకములం జదువువఱకు నాటకముల వ్రాయరైరి. గీర్వాణకథల నెఱింగియు హూణనవలలంగాచిన దనుక నవలలయిం బడరైరి మఱియు గద్యకవన మొకప్రజ్ఞ కాదట. ఆభావముచే నవలలు లేకపోయినవి. నాటకములు వ్రాయమికి అట్టి కారణమే యొకటిగలదు.

కావ్యాలంకారచూడామణి- <poem>

      'వినుత యశంబునంగలుగు విశ్రుతనాకనివాస; మయ్యశో
       జననము శ్రవ్యకావ్యముల సంగతినొప్పగు; శ్రవ్యకావ్యముం
       దనరు గవిప్రభావమున; దత్కవి సమ్మతిలేనిరాజులే
       పునవిహరింప; రవ్విభులు పోయినజాడ లెఱుంగబోలంనే.' (3-90.)
   మ. కవిసంసిద్ధపదంబు భావరస విఖ్యాతంబు లోకోచిత
       వ్యవహారంబు నుదాత్తనాయకము శ్రవ్యంబుం జతుర్వర్గ సం