పుట:Vedhamu Venkataraya Shastrula Vari Jeevitha Charitra Sangrahamu.pdf/204

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్లో. ఈదృగధీతీశాస్త్రే గైర్వాణగ్రంథ జాలేచ
   అంధ్రగ్రంథేషుతథా నహిదృష్ట: శ్రుతచరోవాపి

ఇంకను పలువురు శ్లోకములను పద్యములను వ్రాసి యున్నారు. శ్రీమహారాజావారు తాతగారిని తమ యాస్థానమునందు కొంతకాలముంచుకొని 600 రూప్యములును బంగారుతోడా జోడుశాలువలు నొసంగి మార్చి 26 తారీఖున వీడ్కొలిపిరి.

నెల్లూరిలో తాతగారికి శిష్యులు సంపాదించిన గృహము చాలపాతది. అందులో వారు చేరిన క్రొత్తలో తలుపులు లేవు. పైనదూలములు అడవికొయ్యలు వానకాలమున బొత్తిగా నిలువచోటుండదు. ఎంతమాత్రము నివాసయోగ్యముగా నుండలేదు. గద్వాలనుండి వచ్చినవెంటనే పైకప్పునెత్తిన పడకుండ ఇంటిని కాపాడుకొనుటకు ఆడబ్బు ఖర్చైనది. ఇట్లే వచ్చిన ద్రవ్యమంతయు వ్యయమగుచుండినది. ఇట్టివానికి పోగా మిగిలినది ఇంటికి చెల్లుచుండినది.


__________