పుట:Vedhamu Venkataraya Shastrula Vari Jeevitha Charitra Sangrahamu.pdf/131

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
తే 22-3-'02 నెల్లూరు

ఆర్యా, నమస్కారములు.

.......నేనురోగినైనాడను. దూరమునడువ లేను. ఎండసోకగూడదు. ఎట్లుజీవించగలనో దిగులుగానున్నది రాజైశ్వర్యములు వలసియున్నవి. ఆర్జననున్న...కుదురుపాటు చిక్కలేదు. చిత్తచాంచల్యము మెండుగానున్నది. ఇందుచే బక్షవాయువు వచ్చునట్లు తోచుచున్నది ఏదివచ్చినను ననుభవించక తీరదుగదా. విశేషములులేవు.

మీవిధేయుడు
పూండ్ల రామకృష్ణయ్య

శాస్త్రులవారికి వీరువ్రాసినజాబులు దాదాపు రెండువందలు. వానిలో కడపటిది 30-4-'03 తారీఖున వ్రాయబడినది. తర్వాతజాబులేదు. పూండ్ల రామకృష్ణయ్యగారు శాస్త్రులవారికి ఆప్తమిత్రులై తమపత్రికను వారిపత్రికగానే జరిపి అనుక్షణము సలహాలను పొందుచుండినవారు. ఆంధ్రకవిపండిత సంఘసమరమున శాస్త్రులవారికి తోడునీడగానుండిరి. పెక్కు అముద్రిత గ్రంథములను చక్కగా సంస్కరించి బహుగ్రంథ పరామర్శపూర్వకములైన విపులవిమర్శలతో ముద్రింపించిరి. 1904 సం. సెప్టెంబరు 1 తేదినాడు నెల్లూర, స్వర్గస్థులైరి. అముద్రిత గ్రంథచింతామణియు నిలిచిపోయినది.

ఆప్తమిత్రునిమరణము శాస్త్రులవారికి చాలహృదయావేదనకు కారణమైనది. కాలము గడువసాగినది. శాస్త్రులవారును ఐహికచింతలను మఱచుటకై గ్రంథపఠన రచనలలో మునిగిపోయిరి.


___________