పుట:Vedhamu Venkataraya Shastrula Vari Jeevitha Charitra Sangrahamu.pdf/114

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

12-ప్రకరణము

*కవిపండితసంఘము - ద్వితీయసమావేశము.

"దీనిచర్య సుబోధకమగుటకై లఘువుగా నుపోద్ఘాతము వలసియున్నది. వేంకటరాయశాస్త్రిగారీ మూడుగ్రంథముల నీనడుమవ్రాసిరి.

1. ప్రతాపరుద్రీయనాటకము - దీన నీచపాత్రములకు గ్రామ్య ముపయుక్తమయినది.

2. జక్కన విక్రమార్కచరిత్ర ముద్రణవిమర్శము - ఇది రాయదుర్గము నరసయ్యశాస్త్రిగారు శోధించినట్టి విక్రమచరిత్రమున వేంకటరాయశాస్త్రిగారు దోషములుచూపి దిద్దిపెట్టినగ్రంథము.

3. ఆంధ్ర ప్రసన్నరాఘవ విమర్శ - వేంకటరత్నము పంతులవారి గ్రంథమునందలి దోషములను వేంకటరాయశాస్త్రిగారు వెల్లడిచేసినారు.

ఇందులో ప్రతాపరుద్రీయపద్ధతిని నీచపాత్రములకు గ్రామ్యమే లక్షణసమ్మతమైనచో కృష్ణమాచార్యులవారి చిత్రనళీయము, వేంకటరత్నము పంతులవారి ప్రసన్నరాఘవము, నరసయ్యగారి శాకుంతలము, ఇత్యాద్యనేక నాటకములు లక్షణవిరుద్ధములగును. గాన గ్రామ్యమే అవలక్షణమని సిద్ధాంతీకరించుట కృష్ణమాచార్య ప్రభృతులకు హితము.

విమర్శలు తలయెత్తినచో కవులకు స్వాతంత్ర్యముడుగును. అపండితులు గ్రంథరచనచేసి కవియశస్సును పొందుట కలవిగాదు. కాన విమర్శలకు అపండితకవులెల్ల ద్వేషులేయగుదురు.

ఈమూడు గ్రంథములును వెలువడకమున్ను ఒకపరి బళ్లారిలో సరసవినోదిని సభవారు కృష్ణమాచార్యులవారితోగూడ కరతాళఘోషములతో వేంకటరాయశాస్త్రులవారిని 'నిక్కంపుంబండితులు. చొక్కంపువిమర్శకులు' అనిపల్కిరని కృష్ణమాచార్యుల బావమఱది బ్ర.శ్రీ. నృసింహాచార్యుల

____________________________________________________________________

  • కవిపండిత సంఘచరిత్రతత్త్వమునుండి.