- తే 22-11-97 నెల్లురు.
ఆర్యా, నమస్కారములు
శశిలేఖలోనిదగు విమర్శనము ద్రావిడప్రాణాయామము గాని వేరుగాదు.....ఎట్లును వారియభిప్రాయము మన కనుకూలముగ రాదు దానియందేమో ద్యోతకమగుచున్నది. పూ.రా.
శారదా కాంచిక - ప్రథమకింకిణి
నాటిస్థితి యీజాబులచే కొంతతెలియుచున్నది. ఈచిన్న పుస్తకమున నింతకన్నను పెంచివ్రాయుటకులేదు. శాస్త్రులవారికి ఇక నొకటేమార్గము. తమ్ము దూషించువారిని నిరుత్తరులంజేయుటయే. అన్నివైపుల నందఱును తఱుముచుండిన నెంతకాల మొకప్రాణి యూరకుండును.
శాస్త్రిగారు, కొక్కొండము వేంకటరత్నము పంతుల వారి మిత్రకోటిలోచేరిన శ్రీరాయదుర్గము నరసయ్య శాస్త్రిగారును కొమాండూరు అనంతాచార్యులవారును పరిష్కరింపగా ఆనంద ముద్రణాలయమువారు ముద్రించిన, జక్కనవిరచిత విక్రమార్కచరిత్రమును విమర్శించి అముద్రితగ్రంథచింతామణ్యనుబంధముగా ప్రకటించిరి. తమ్ము నిరంతరము దూషించి వ్రాయువారిని వాకట్టుకొరకు ఆడంబరముగా తమ విమర్శకు శారదాకాంచికయనియు ఈలఘుగ్రంథము అందు ప్రథమకింకిణియనియు, ఇందుచే నింకను పెక్కు కింకిణులు (అనగా విమర్శలు) వెలువడనున్నట్లును ప్రకటించిరి.
ఈ విమర్శయొక్క యవతారికలో శాస్త్రులవా రిట్లు వ్రాసిరి-