పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/191

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆ సిద్ధాంతాన్ని అనుసరించే జీవ శాస్త్రజ్ఞులు (Biologists) కొందరు బయలుదేరినారు. అశక్తత వల్ల మరణించబోయే పసిపిల్లలకు పోషణ అనవసరము; వారు చనిపోవుటయే లోకానికి శ్రేయస్సు అని వారి అభిప్రాయం. కానీ లోకములో ప్రాణికోటి ముఖ్యంగా -మానవుడు, అనంతమైన మానసిక పరిణామాన్ని పొందినాడు. ఇటువంటి ఘాతుక కృత్యాలకు అతను పూనుకోలేడు ఆ అనాగరక స్థితిలో అతడు నిలువలేడు. కేవలం ప్రకృతి చేసే హింసావిధానాన్ని విప్లవ తత్త్వంతో ఎదుర్కొని అరికట్టకుండా దాసోహం చెయ్యలేడు.


ప్రకృతి సహజమైన ఎన్నిక చేయగలిగేమాట వాస్తవము. కాని క్రొత్తవాటిని సృజించే శక్తి దానికి లేదు. వాతావరణానికే ఈ శక్తి వున్నది. ప్రకృతి త్రోసి పారవేసిన వాటికి ప్రాణం పోసే శక్తి దానికున్నది. మెండల్ మహాశయుడు ఉద్భవించి పై జాతికి చెందిన జీవశాస్త్రజ్ఞుల దృక్పథాన్ని మార్చినాడు. వాతావరణానికి కూడా అనంతమైన శక్తి ఉన్నదనీ, దానిమూలంగా ప్రాణులు నూతన గుణాలను కొన్నింటిని సంపాదించుకుంటున్నవనీ నిరూపించి శాస్త్రజ్ఞులోకానికి చూపించినాడు.


ప్రాణిలోకంలో గుణాలు సుస్థిరంగా ఉండవనీ, మార్పును పొందుతూ ఉంటవనీ శాస్త్రజ్ఞులు అభిప్రాయము నిచ్చినారు. కొన్ని గుణాలు కొన్ని కాలాలలోనే వుండి తదుపరి మార్పు పొందుతవని వారి ఉద్దేశ్యము. వీటిని శాస్త్రవేత్తలు 'మ్యుటేషనులు' అన్నారు.


అది కారణంగా వృక్షజాతుల ఋతు కాలములో ప్రాణాండాలు (Germ - Cell) ఏకమైనప్పుడు మొదటి జాతికంటే భిన్నమైన జాతి లక్షణాలేర్పడవచ్చునని మెండల్ మహాశయుడు పరిశోధనల మూలంగా నిరూపించినాడు. అంటే వాతావవరణం వల్ల ప్రాణికోటిలో దాగి ఉన్న కొన్ని శక్తులు బహిర్గత మౌతవని తాత్పర్యార్థము.


అది సాంఘికం కావచ్చును. లేదా రాజకీయం కావచ్చును. వైజ్ఞానికమూ కావచ్చును. ఏ పథకానికైనా ఒకటే ఆదర్శం. ఉదాత్తమూ, ఉత్తమమూ అయిన మానవ సమాజాన్ని సృజించుకుంటూ పోషించుకోవటము దాని ధర్మమై ఉంటుంది. ఈ దృష్టితోనే ఏ జాతి పుక్కిటి పురాణాలైనా, అర్థం బద్ధం కనుపించని ఏ దేశంలోని ఆచార వ్యవహారాలనైనా శీలసంపత్తులనైనా విమర్శించవలసి వుంటుంది. ఏ జాతి ఐనా ఎంతమంది ఉత్తమ మానవులను సృజించింది. వారి గుణగణాలేమిటి? ప్రపంచాభ్యుదయానికి ఆ జాతి చేసిన దోహద సేవ ఏమిటి? అనే ప్రశ్నలు.


హిందూజాతి, సంతానాన్ని - దాని లక్షణాన్నీ, బాగా అవగతం చేసుకున్నది. అధునాతన కాలంలో పుట్టిన సంతాన శాస్త్రంలోని ధర్మసూక్ష్మాలన్నీ హిందూజాతి


సంస్కృతి

191