Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/62

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఏడవ దృశ్యం


(గురజాలలో నాగమ్మకార్యాలోచనా మందిరము. యుద్ధ విషయిక సంభాషణ నడుస్తూ ఉంటుంది

నాగమ్మ : (నివేదనా పూర్వకముగా) ప్రభూ! బాసపత్రికలు అందుకున్న మిత్రరాజులందరూ సమయం తప్పకుండా సైన్యాన్ని పంపిస్తున్నారు. వీర భల్లాణుడు లక్ష కాల్బలం, గజబలం నూరూ పంపించాడు. కామభూపతి పంపిన వేయి గుర్రపు దళం చేరింది. కాకతి ప్రతాపరుద్రుడు కాలర్లను కానుక లంపించాడు. సామంత రాజులే సైన్యానికి కావలసిన ఆహార పదార్థాలన్నీ అందజేస్తున్నారు. ఎవరుబట్టినా అవసరమైతే ఇంకా బలాన్ని పంపిస్తామనే వాళ్ళే -

నరసింహరాజు : (ఔత్సుక్యంతో) మన్నెరాజు ఏమన్నాడు మహామంత్రిణీ! గుండమ దేవుడి కోటలో గుర్రాలు మందలు మందలుగా ఉన్నవట కదూ? అతడేమన్నా-

నాగమ్మ : అతడి దేముంది మనకు ఆప్తుల్లోవాడు. తానే బలాన్ని వెంట నడిపించుకొని వస్తుంటాడు. నలగామరాజు : దేశంలో ప్రజలో?

నాగమ్మ : (ఏహ్యభావంతో) ప్రజలా! పశువులు. వాళ్ళు ఏమంటే మనకేం? ఎర చూపిస్తే ఎన్ని చేపలైనా వాలుతవి. అందులో యువరాజులుం గారు తానై ప్రచారం చేసిన తరువాత గుంపులు గుంపులుగా వచ్చి చేరరా?

నరసింహరాజు : (స్వాభిమానంతో) ప్రజల విషయం నేను ఘంటాపథంగా చెపుతాను. బ్రహ్మన్న పక్షంలో ఒక్క పురుగు చేరదు.


చివరకు యుద్ధభూమిపయి చిక్కిన చిత్రవధల్ తొలంగవం
చవల కుటుంబ నాశనము లంచును నే బెదరించి వచ్చితిన్
ఎవియెవియో శుభం బనియ యెన్నియొ యాశను బెట్టి వచ్చితిన్
అవసరమైన బొక్కసము నంతయు వారికి క్రుమ్మిరించెదన్.


62

వావిలాల సోమయాజులు సాహిత్యం-2