2
(ధర్మఘంటికా ప్రాంగణమున)
మనునీతి
న్యాయము నాకాంక్షించుచు నా ఘంటిక మ్రోయించిన
యాతని నన్వేషింపుం డచిరముగా సౌవిదల్ల!
సౌవిదల్లుడు
ఈ పున్నమి వెన్నెలలో ఎటనుండెనొ కానరాడు
ఏడీ ప్రభు! వాడెటనో ఇరులలోన నుండి యుండు.
కాన్పించును వెదకినచో కంచుకాగడాలతోడ.
(ప్రక్కకు దృష్టి మరల్చి)
ఓ బోయీ! ఇటు రమ్మా ఉన్నాడో చూడవలయు
మర్రిచెట్టు క్రీ నీడల మాటుననే ఉన్నాడో!
(బోయీతో సౌవిదల్లుడు నిష్క్రమించును)
మనునీతి
చిత్తక్షోభ మ్మింతట చిన్నమైన తరుగలేదు.
ఏను ప్రజాపాలనంబు నెంతో ధర్మరీతితోడ
సల్పుచున్నవాడ నన్న సంతసంబు క్షీణించెను.
జీవితాస్త మయమునందు చెడు సంప్రాప్త మ్మగునో
నిలువ లేకయున్నాడను నే నీ ప్రాంగణమునందు.
దేశంబున ధర్మజ్యోతి దీపించుట కే తలచితి.
నాయౌవన కాలంబున నాటుకొనెం జిత్తుములో
హర్మ్యోపరిభాగంబున నిర్మింపగ ధర్మఘంటి.
వర్ధిల్లెను నా కోర్కెయు వరియించగ రాజ్యలక్ష్మి
శాసించితి నంతటనే స్థాపింపగ ధర్మఘంటి.
568
వావిలాల సోమయాజులు సాహిత్యం-2