శ్రమియింతముగాత మనము - మన అధ్యయనము తేజో
వంతమ్మగుగాక - ఎప్పుడు - ద్వేషము లేకుండా ఇరు
పురమును మనియెదముగాక" అని వ్రాసియున్నారు.
"కృతతీర్థ పయసామి వాశయః - సతు తత్ర విశేష దుర్లభః”
“కాలువ, చెఱువు, లేక నీటిమడుగు మున్నగు వానిలో రాఁబోవువారికి స్నానము చేయుటకె దిగుటకు వీలుగా రేవును ఏర్పాటుచేయువాఁడు అరుదు. అతఁడే పొగడదగినవాఁడు" అనిన బాలకవిసూక్తి ననుసరించి యిట్టి గేయ భేదమును మొట్టమొదటగా శ్రీదాసుగారి చరిత్రలోఁ బ్రవేశపెట్టిన కీర్తి శ్రీ సోమయాజులవారిదే.
శ్రీ నారాయణదాసార్చకులు శ్రీ కర్రా ఈశ్వరరావుగారు. వారి యర్చనలో 'ఉపాయన'ల నీరాజనమిచ్చినవారు శ్రీ సోమయాజులుగారు. దానినిఁ గన్నుల నద్దికొనుటయే నా యీ కృత్యము. ఇందెంతమాత్రము కృతకృత్యుఁడనో భావికాలమున సహృదయులైన చదువరులే ప్రమాణము. నా కీ యవకాశమిచ్చిన మిత్రులు శ్రీ ఈశ్వరరావుగారికిఁ గృతజ్ఞత.
ప్లాట్ నెం. 21 అన్నపూర్ణనగర్
వట్టిపల్లి మల్లినాథశర్మ
అమరావతిరోడ్ గుంటూరు-34
8-1-1990
శుక్ల-పుష్యశుద్ధోపైకాదశి. ________________________________________________________________________________
796
వావిలాల సోమయాజులు సాహిత్యం-1