పై వాక్యములు "చెళ్లపిళ్ల వారివి
'అందగాండ్ర తలకట్టు*: -
మైసూరు దొరేను తోడాలను తొడుగుట, అంకినీడు కాలికి గండపెండేరము తొడుగుట, 18వ ఏటనే అరవము, మలయాళము, కన్నడం, బంగాలీ, తెలుగు సీమలందు మెప్పుపొందుట, 80వ యేట గూడ గజ్జెగట్టి కథచెప్పుట. వీరు రచించిన గ్రంథములు.. వివరించిరి.
15) శ్రీ దాసుగారి -మూర్తి విశేషము వారి అలంకారమును గూర్చి, తెలుపుచు :
"శారదావతార మీరు - పెద్దదయిన తలకొప్పును
దానిపైన రమ్యపుష్పగుచ్ఛమ్ములు, ఫాలభాగ
మున కుంకుమబొట్టు కనుల - దిద్దుకొన్న కడు నల్లని
కాటుకయును దేహముపై - లేపనాదులు...’
ఇచట, దాసుగారు కన్నులలో కాటుక పెట్టుకొనినారు, అనుటను గూర్చి కనుల- కాటుక స్త్రీలకే అనిపించును, అట్లుకాదు, స్మార్త కర్మలలో “స్నాతక వ్రతము” అను ఒక సంస్కారమున్నది. ఇది నేఁడు 30వయేట పురుషులు యాజ్ఞికులకొఱకు కన్యాదాతలనుండి పాదరక్షలు, గొడుగు కఱ్ఱ - అద్దము, మొదలగు వస్తువులను సంపాదించుటకు, “కాశీయాత్ర” అను నొక అభినయము జరుపుకొనుచున్నారు. ఈసంస్కారము ఎప్పుడు బ్రహ్మచారి చేసికొనవలెనో దానినిఁ గూర్చి ఆపస్తంబమహర్షి:
"వేద మధీప్యస్నాస్యన్... (5 12 1 ఆపస్తంబ సూత్రము”) అని
ప్రారంభించి "ఏవం ఉపనీత చరితబ్రహ్మచర్యః అధీత వేగ
షడంగః యది ఆచార్యకులాత్ అన్య మాశ్రమం ప్రేప్సుః
భవతి. తస్య స్నానం నామ కర్మ ఉపదిశ్యతే...”
ఉపనయనము నాఁటినుండి గురుకులముననే ఉండి బ్రహ్మచర్యవ్రతముతో షడంగములతో పాటు, మొదట స్వశాఖాధ్యయనమును చేసి, వీలున్నచో మఱొక వేదమును అధ్యయనము చేసిన తరువాత, బ్రహ్మచర్యాశ్రమధర్మములను వదలి, మఱొక ఆశ్రమము ప్రవేశింపఁదలఁచినచో (గృహస్థాశ్రమమును స్వీకరింపఁ దలఁచినచో) అట్టి వానికి “స్నానం” అను సంస్కారము ఉపదేశింపఁబడుచున్నది. ఇట్టి సంస్కారమును పొందినవాఁడు “స్నాతకుఁడు" అనఁబడును. వీఁడు చేయునదే స్నాతకవ్రతము. దీని తరువాత ఒకవేళ వెంటనే గృహస్థు కాలేక పోయినచో బ్రహ్మచర్యాశ్రమ ధర్మములను
ఉపాయనలు
785