Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/411

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

గనుకనే మన చుట్టు నున్న ఈ సృష్టికి అర్థమ్మును గూడ మనం తెలుసుకొనం గా గలుగుతునున్నాము. కీట్సు మహాకవివర్యుడు గ్రీకు పాత్రపైన ఒక్క గీతంలో "ఓసి మూక రూపమ్మా! అంతరహిత మైన కాలమటుల నీవు గూడ మమ్ము భావనా జగమ్ము నుండి వెలికి లాగు తున్నావే” అని గానం చేయటంలో కోపము లే నట్టి రూపములు అన్నిం ట్లోని ఉన్న, నిర్వచింప రాని యట్టి ఏకత్వ ర హస్యాన్నే అనుభవమ్ము నొందినాడు. ఈ రహస్య మే మనలను భావాతీ తమ్ములైన లోకాలకు తీసుకెళ్ళి అనంతత్వ ముతో మనకు ప్రత్యక్ష స్పర్శను కలిగిస్తున్నది ఇదియే కవి తాను చూచి లోకానికి ఆవిష్కర ణమ్ము చేయవలసినదే సత్యము. ఇదియేను కీట్సు మహాకవుల మతం కవితలోని వేదనా ని రాశలకును మధ్యనుండి అతికష్టంతో వెలువడు కాంతి రేఖలుగా దర్శన మిస్తున్నది. "మానవతా దారిద్ర్యము - మాసిపోని దారిద్ర్యము, బరువు బ్రతుకు దినాలున్ను, ఇరుకు దారి నడకలున్ను, మనకు నుదుటి వ్రాతలేను. అయిన నొకటి నిజము, నిజము. తమోరాశి త్రోసిపుచ్చు సమ్మోహన రూపమొకటి సౌందర్యము నింపుకొంటు విందొనర్చు నందఱకును, సత్యమిందు సౌందర్యపు రూపంతో వ్యక్తమౌతు ఉంటుందను సూచనిందు లో ఉన్నది. విశ్వసృష్టి అనెడి శాశ్వ తలపు చిత్ర వస్త్రంలో సౌందర్యం అన్నది ఒక హఠాత్సంఘటన మాత్ర మే అయితే అది బాధా కరమై వాస్తవ విషయా లతో తనకు ఉన్న యట్టి 411