Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/301

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఈ శ్లోకం ఉక్కు పిండం ఏ వృత్తంలో కరిగి పోదామన్నా కరిగేట్లు లేదు. దొమ్మల గుండ అనే ఒక మృగం తిరుగుతూ వుంటుందట శ్రీ కాకుళం జిల్లా ప్రాంతాలలో అది ఎముకల్ని వాసన చూస్తే అవి మెత్తబడతాయంటారు నిజమో అబద్ధమో! అయితే, ఆ జంతువు తాలూకు ఎముక బిళ్లతో వుంగరం తొలిపించి, దాన్ని ఎడమచేతి మధ్య వ్రేలుకు పెట్టుకుంటారు, అరిసెమొలల వ్యాధి వున్నవారు చాలా మంది ఆ ప్రాంతాలలో మన సోమయాజులు గారి అనువాద శక్తిన్నీ అలాటిదే ఐవుండాలి లేకుంటే ఆయన ఒకసారి చూడగానే, ఈ శ్లోకాలు ఎందుకు అలా అమాంతం కరిగి, వృత్తాల మూసల్లో ఒదుగుతాయి!

ఈ శ్లోకానువాదం మత్తేభరూపం చేకొని ఏనుగ నడిచినట్లే నడిచింది. చూడండి:-

“అనుమానాఖ్యము నౌ ప్రమాణ మది నాల్గంగంబులై యుండు” నంటూ ఎత్తుకొన్నారు. అనుమానేషు అయం విధిః అన్నమాటను విప్పిచెప్పారు. అనుమానమనే ప్రమాణంవున్నది కదా? అది నాలుగు తీరులుగా వున్నదండీ! అని తేల్చి చెప్పారు. లోభ, హేతు, ధన, సాధ్యములకు క్రమాలంకారపరంగా దృష్టాంత, పురోహిత, ఆత్మోత్కర్ష, నిగమనాలు ఫలాలుగా చెప్పబడ్డాయి, మూలంలో వావిలాలవారు తెలుగులో దేనిఫలం దానికి జోడించేశారు - దృష్టాంతమగున్ పురోహితుడు, పొందున్ హేతు వాశన్, ధన మ్మది సాధ్యమ్మున సాధ్యమౌ నిగమనమ్మున్ స్వప్రశంస మ్మగున్. ఇక్కడికి ఐపోయింది మూల భావసర్వస్వం. సోమయాజులు గారు ఊరుకోలేదు. అసలు సంగతి బైట పెట్టారు, నీలకంఠ దీక్షితులవారు తన శ్లోకంలో చోటుచాలక, ధ్వనిపూర్వకంగా వదలివేసిన భావాన్ని - ముక్తాయింపుని అనుమానాస్పదులౌ జనావాళికి, సాధ్యంబేకదా సర్వమున్? అంటూ పద్యాన్ని నాటకీయంగా ముగిస్తూను.

పదహారో పద్యం చూడండి. కదను త్రొక్కుతూ ఎలా నడిచిందో, నీలకంఠ దీక్షితులవారి శ్లోకాన్ని అరటిపం డొలిచినట్లు ఒలిచి చేతికందిస్తున్నట్లుగా-

     "ఆయుః ప్రశ్నాదీర్ఘ మాయుర్వాచ్యం మౌమూర్తికై స్సదా
      జీవన్తో మహు మన్యస్తే మృతాః ప్రక్ష్యంతి కం పునః”

ఇది మూల శ్లోకం. దీనికి సోమయాజులుగారి అనువాదం ఇది :

మ. “ఇలపై నా బ్రతు కెంత కాల మని ప్రశ్నింపంగ, దైవజ్ఞుఁడు
     జ్వల వాక్యముల "దీర్ఘమాయు" వని తెల్పంజెల్లు - జీవించెనా
     కలుగున్ గౌరవ మద్భుతంబుగను, కాకన్ కాలగర్భమ్మునం
     గలియన్, రాడుగదా 'ఇదేమి' యని ధిక్కారించి ప్రశ్నింపగన్


కలివిడంబన

301