పుట:Varavikrayamu -1921.pdf/98

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

దశ మాంకము

(ప్రదేశము: రాజవీధి.)

(ప్రవేశము: పురుషోత్తమరావుగారు, బసవరాజు, భ్రమరాంబ, కమల.)

పురు : -

సీ. కొసరి కట్నములందు కొంటయే గౌరవ
        మని తలపోసెడి యజ్ఞులార!
    వచ్చి ముద్దుగఁ బిల్ల నిచ్చెద మనఁ గట్న
        ములకు బేరములాడు మూర్ఖులార!
    అబ్బాయి పెండ్లితో నప్పు పప్పులు తీర్చి
        నిలువ సేయఁగ జూచు నీచులార!
    ముడుపులు గొనితెచ్చి ముంగల నిడుదాఁక
        పల్లకి యెత్తని పశువులార!

    ఏమి యన్యాయమిది! పూర్వ మెన్నఁడేని
    వరుల నిటు విక్రయించిన వారు గలరె?
    పూజ్యతరమైన మన పుణ్యభూమియందుఁ
    గటకటా! నరమాంస విక్రయము తగునె!

బస :-

సీ. కట్నాలకై పుస్తకములు జేఁగొని, పాఠ
        శాలల కేగెడు చవటలార!
    పిలిచి కాళ్ళు కడిగి పిల్లనిచ్చినవారి
        కొంప లమ్మించెడి కుమతులార!
    అల్క పాన్పుల నెక్కి యవి యివి కావలె
        నని శివమాడెడి యధములార!
    ఎంత పెట్టినఁ దిని యెప్పటికప్పుడు