తృతీయాంకము
41
పురు :- (రోషముతో) సరే కానిమ్ము నాలుగువేల నాలుగు వందలు.
వీర :- అయిదువందలు
పురు :- ఆరు; రా యెంతవరకు రాగలవో రా.
వీర :- రాక విడిచి పెడుతానా? యేడువందలు.
పురు :- ఎనిమిది ?
బస :- (తనలో) బాగు బాగు! ఫార్సులాగునే యున్నదే!
గీ. పేకల నోకులం బాడు వీఁక నడి బ
జారులో గుడ్డలం బాడు సరణి; పెండ్లి
కొడుకు నిటు మధ్య నిడి, కసి గొన్న యట్లు
వేలముం బాడు టెన్నఁడు యెరుంగ !
లింగ :- వీరయ్య! వీరిక్రింద ఖాయపరుప వచ్చునా!
వీర :- అప్పుడేనా? అయిదువేలు?
పేర :- (లేచి) బాబూ, యీ బేరం మనకు కుదిరేదికాదు లేవండి.
పురు :- అయ్యా! సెలవు తీసుకొను మనెదరా?
లింగ :- సందర్భము లన్నియుఁ దమరు స్వయముగా జిత్తగించుచు నన్ను నెప పెట్టుట న్యాయమా!
పురు :- సరే మీ చిత్తము. (అని లేచి పేరయ్యత బైటకేగును)
వీర :- కొంపతీసి, బేరం గోవిందా కొట్టదుగద?
లింగ :- వెర్రివాఁడా! పేరయ్య అంత పెయ్యమ్మ యనుకొంటివా?
వీర :- నన్ను మెచ్చుకోరేం? నా పాఠం నేనెల్లా వప్పగించాను?
లింగ :- నిత్యము గోర్టులలో బ్రతుకు ముండకొడుకవు; నీకిదిలెక్కా (అని యేదియో వ్రాయుచున్నట్లు నటించును.)
బస :- (తనలో) వీరి ప్రసంగంబట్టి వీరేదియో కుట్ర సాగించునట్లు కనబడుచున్నది. వీరయ్య ఫాల్సు పాటగాడై యుండును.
పేర :- (బయటను) పంతులుగారు! బహుదూరం వెళ్ళారు. ఇంతదూరం వెళ్ళడం నాకిష్టంలేదు. వెళ్ళకచేసేదీ కనపడలేదు. ఆ ఏల్నాటి శనిముండాకొడుకు లేకపోతే ఏంచక్కా ఫయిసలయ్యేది! చెరపడానికి చేటపెయ్యచాలును!