28
వరవిక్రయము
ఘంట:- (ప్రవేశించి) బాబూ! పది కావచ్చింది. వంట సామానిస్తారా!
లింగ:- నీవంట వల్లకాడుగాను! నీకింత తిండియేవ యేమిరా! ధనుర్మాసము దప్పళమున కెవరైన పిలుతురేమో కాసింతసేపు కనిపెట్టఁగూడదా?
ఘంట:- సరే, మీ యిష్టం. రాత్తిరి పద్దులు రాసుకుంటారా?
లింగ:- అదిగో ఆ మాటన్నావు సరి! (అని డసుకు పెట్టె దగ్గఱఁ గూరుచుండి, పద్దుల పుస్తకము పైకిఁదీసి) ఏదీ చెప్పు, బియ్య మెన్ని?
ఘంట:- మణిమెడు తక్కువ మానెడు.
లింగ:- (వ్రాయుచు) వంటకట్టెలు?
ఘంట:- మూడు.
లింగ:- పిడకలు?
ఘంట:- రెండు.
లింగ:- నిప్పు పుల్ల?
ఘంట: -నిన్న మధ్యాహ్నం చీల్చిన పుల్లలో నిలవ బాపతు సగం.
లింగ:- ఉప్పు?
ఘంట:- వుద్ధరిణేడు.
లింగ:- చింతపండు?
ఘంట:- నిన్న మధ్యాహ్నం పులుసుకోసము పిసగ్గా నిల్వవున్న తుక్కు.
లింగ:- ఉట్లేమి చేసినావు?
ఘంట:- వుంచా నీపూటకు.
లింగ:- మిరపకాయలు?
ఘంట:- మూడు.
లింగ:- మాగాయ?
ఘంట:- అమ్మగారి కోటెంకా, అబ్బాయిగారి కో ముక్కాను.
లింగ:- గంజి?