పుట:Varavikrayamu -1921.pdf/29

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

28

వరవిక్రయము

ఘంట:- (ప్రవేశించి) బాబూ! పది కావచ్చింది. వంట సామానిస్తారా!

లింగ:- నీవంట వల్లకాడుగాను! నీకింత తిండియేవ యేమిరా! ధనుర్మాసము దప్పళమున కెవరైన పిలుతురేమో కాసింతసేపు కనిపెట్టఁగూడదా?

ఘంట:- సరే, మీ యిష్టం. రాత్తిరి పద్దులు రాసుకుంటారా?

లింగ:- అదిగో ఆ మాటన్నావు సరి! (అని డసుకు పెట్టె దగ్గఱఁ గూరుచుండి, పద్దుల పుస్తకము పైకిఁదీసి) ఏదీ చెప్పు, బియ్య మెన్ని?

ఘంట:- మణిమెడు తక్కువ మానెడు.

లింగ:- (వ్రాయుచు) వంటకట్టెలు?

ఘంట:- మూడు.

లింగ:- పిడకలు?

ఘంట:- రెండు.

లింగ:- నిప్పు పుల్ల?

ఘంట: -నిన్న మధ్యాహ్నం చీల్చిన పుల్లలో నిలవ బాపతు సగం.

లింగ:- ఉప్పు?

ఘంట:- వుద్ధరిణేడు.

లింగ:- చింతపండు?

ఘంట:- నిన్న మధ్యాహ్నం పులుసుకోసము పిసగ్గా నిల్వవున్న తుక్కు.

లింగ:- ఉట్లేమి చేసినావు?

ఘంట:- వుంచా నీపూటకు.

లింగ:- మిరపకాయలు?

ఘంట:- మూడు.

లింగ:- మాగాయ?

ఘంట:- అమ్మగారి కోటెంకా, అబ్బాయిగారి కో ముక్కాను.

లింగ:- గంజి?