పుట:Uttara Ramayanamu Kankanti Paparaju.pdf/84

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీ మ దు త్త ర రా మా య ణ ము

60

      జనఁ గావించి విముక్త పద్మ యగు శ్రీచందాన నింపొందునం
      దనమో మాదర వూరితేక్షణములన్ దర్శించి వంశంబు మ
      న్చునుపాయం బొకటే గణింతు వినుమంచు గూర్మితో నిట్లనున్ 117

ఉ. మానిని యీమణీమయవిమానముపై జనువాడు విశ్రవో
      మౌనికుమారుఁ డీశ్వరసమానుఁ డుదగ్దిశ యేలు నెప్పుడున్
      వీని జయించుపాటిరణవీరులు గల్గుదు రమ్మహామునీ
      శానుని భార్య వై యతని సాధుమతిన్ భజియించి తేనియున్ . 118

సీ. దౌహిత్రకులముచేఁ దమకు మేలగునంచుఁ బితృ దేవతలు మనఃప్రియముఁగందు
     రాఁడుబిడ్డయు నల్లుఁడని వేడుకలు సేయఁ,గలిగెఁగా యని తల్లి యెలమిఁబొందుఁ
     గన్యకాదానాభిగణ్యఫలంబు దనకుఁ జేకుఱు నంచు జనకుఁ డలరు
     వరుసతో భోగించి వరములీయఁ దలంచి యనలేందుగంధర్వు లాశ్రయింతు

తే. రాత్మజామణి జనియించె నన్నమాత్ర,
      నట్టికన్య యసామాన్య యని యెఱింగి
      కులవయోరూపశీలభంగులకు దగిన
      విభు వెదకి పెండ్లి గావించి వెలయు గురుఁడు. 119

మ. తనుజామాత్రవు గావు వంశమున సౌందర్యంబునన్ సద్గుణం
      బున శ్రీదేవికి సాటి సేయఁ దగు నిన్ బూఁబోఁడి మావాని కి
      మ్మని యేబంధుఁడు వేఁడఁగా వెఱచుఁ బ్ర త్యాఖ్యానశంకాప్తి జ
      వ్వని వైనన్ దినముల్ గ్రమింపఁబడె నుద్వాహార్హునిన్ గానమిన్ 120

చ. కమలదళాక్షి కూతు నిలఁ గాంచుట మేలగు నైననొక్కప
      క్షమున విచార హేతు పని కాంచెద నెట్లగు నన్నఁ దల్లి వం
      శము గురునన్వయంబు పతిసంతతి కన్య దురాత్మయైన నొ
      ప్పమి యపకీర్తియున్ సకల బాంధవనిందయు నొందుఁ గావునన్ 121

ఉ. దీని వరించు వీఁ డనుచు దేవుఁ డెఱుంగునో లే కెఱుంగఁడో
      కాని తదన్యుఁ డె ట్లెఱుఁగుఁ గాన యెఱుంగ నితండు నీవిభుం
      డౌ నని తల్లి నీవలన నన్వయ మొప్పు బ్రసిద్దిఁ గాంచు నం
      చేనును నెల్లబాంధవులు నెన్నుదు మిప్పనిఁ దీర్పవే యనన్ 122

ఉ. కమ్మలడాలు చెక్కుల ధగద్ధగ లీన మొగంబు వాంచి కా
     నిమ్మని లేచి సిగ్గు మది నెక్కొన మ్రొక్కినఁ దండ్రి యెత్తి మా
     యమ్మ సుపుత్త్రులన్ గని శుభాన్విత వై మను మిమ్మహామునిన్
     సమ్మతిఁ గొల్చి నీ వని ప్రసన్నత దీవన లిచ్చి పంచినన్. 123

సీ. నఖరుచుల్ చరణారుణచ్చాయలను గూడి యలరుకుంకుమగంధ మవనికొసఁగ
    రమణీయమణి నూపుర ధ్వనుల్ శుచిపక్షు లగుద్విజాతులపల్కు లనుసరింప
    సొగసువాలుమెఱుంగుఁజూపు లాశావీథి కలఁ గల్వవిరిమేలుక ట్లర్ప