పుట:Uttara Ramayanamu Kankanti Paparaju.pdf/82

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీ మ దు త్త ర రా మా య ణ ము

58

       చిన నది ఘంటికల్ రొదలు చేయఁగి మంటలు మింట నంటఁగాఁ
       జని హరిఱొమ్మునన్ మెఱసెఁ జారుఘనస్థితచంచలాద్యుతిన్ . 99

మ. దనుజారాతియు నంతఁ బేరురమునం దళ్కొత్తుతద్ఘోరసా
      ధనమున్ గ్రమ్మఱఁ బూని శాత్రవునిమీదన్ వైవ సేనాని పం
      చినశక్తిన్ బలె మాల్యవంతునెదఁ జొచ్చెన్ వ్రచ్చి దానన్ మహా
      శనిపాతంబునఁ గూలునీలగిరి యోజన్ వ్రాలె వాఁ డుర్వరన్ 100

చ. తొడిగినజోడు వ్రయ్యలుగఁ దోరఫునెత్తుటఁ దోగి యాగతిం
      బడి మఱికొంతసేపునకుఁ బైకొనుశ్రాంతి దొఱంగి స్వస్థుఁ డై
      యడరి నిశాచరాగ్రణి మహాగిరిపోలిక సుస్థిరాకృతిన్
      దడఁబడ కేగు దెంచి హరి దార్కొని మార్కొని విక్రమంబునన్. 101

మ. రటదత్యుజ్జ్వలకింకిణీశతసహస్రస్ఫార కార్ష్ణాయస
     స్ఫుట శాతోత్కటకంటక ప్రకట మై పొల్పొందుశూలంబు మి
     క్కుటపుందెంపునఁ బూని కేశవునివక్షోదేశమున్ గ్రుమ్మి యం
     తటఁ బో కద్దివిజారి ముష్టినిహతిన్ దాటించె రోషంబునన్ . 102

ఉ. ఆతనిసాహసంబునకు నచ్చెరువందె వియచ్చర వ్రజం
    బాదఱి మేలు మే లనుచు నార్చిరి దైత్యులు మాల్యవంతుఁ డీ
    రీతి ముకుందు నొంచి యరరే నిలు మంచు ఖగేంద్రుమోము ని
    ర్ఘాతముఁ బోలుముష్టి హతి ఘట్టన సేసి పరాక్రమించినన్ . 103

ఉ, పక్షికులేంద్రుఁ డల్గి నిజపక్ష పరంపరఁ బుట్టుగాడ్పునన్
    రాక్షసరాజసైనికుల రాయిడిఁ జేసిన పండుటాకుల
    ట్లక్షమతన్ క్షణం బయిస నచ్చట నిల్వఁగ లేక బెండు లై
    దక్షిణవార్ధిలోఁ బడిరి దైవవశంబున లంక త్రోవగన్. 104

వ. అంత. 105

మ. వినతానందనపక్షమారుతహతిన్ విభ్రాంతుఁడై మాల్యవ
     ద్దనుజేంద్రుం డట నిల్వఁ గూడకయ సోదర్యాప్తమిత్రంబుగాఁ
     జనియెన్ లంకకు సిగ్గుతో నిటుల కంజా తాక్షుచేఁ బెక్కుమా
     ర్లనిలో నొచ్చి రసాతలస్థు లయి రయ్యా దానవుల్ రాఘవా. 106

తే. వెలయసాలకటంకటకులమువార, లధికు లమ్మాల్యవన్ముఖ్యు లాహవమున
     రామ నీచేత హతు లైన రావణాది, దనుజవరులు పులస్త్యగోత్రంబువారు. 107

తే. రావణాదులకంటె నిర్వక్రవిక్ర, మక్రమంబున ఘనులైనమాల్యవన్ము.
     ఖాసుర గ్రామణుల గెల్వ హరికిఁ దక్క, నలవియె తదన్యులకు భానుకులవరేణ్య.

చ. హరి హరి యంచు మే మనఁగ నన్యువలెన్ విన వేల నీవె శ్రీ
    హరి వివుఁ డాలకించినమహత్త్వము నీయదె శంఖచక్రముల్