పుట:Uttara Ramayanamu Kankanti Paparaju.pdf/64

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీ మ దు త్త ర రా మా య ణ ము

40

సుపార్శ్వుండును నశనిసంహ్రాది యగుసంహ్రాదియున్ దనుప్రభాప్రహసితోద్దీప్రఘనుం డగుప్రఘనుండును మాగధీభూతసుస్తవనశ్రవణసముదాసకర్ణుం డగుభాసకర్లుండునుఁ బుట్టి దిట్టతనంబున్ జేపట్టి రట్టిరట్టడివీరులకుఁ దోఁబుట్టువు లై బాలయున్ బుప్పోత్కటయున్ గైకసియున్ గుంభీనసయు ననన్ దగు కన్నెలు చెన్నువహించి రంత.
249
మ. వసుదావోపశమాంబుద ప్రతిమదీవ్యద్గాత్రుఁ డమ్మాలియున్
      వసుదారిద్ర్యయుతుండు పెన్నిధులఁ జెందన్ గోరుచందంబునన్
      వసుదాభామినిఁ గూడి శౌర్యనిధులన్ వాంఛించి విద్విడ్విభా
      వసుదాయాదులఁ గాం చెఁ బుత్రులఁ జతుర్వారాశిసంకాశులన్ . 250

క. సరసుం డనలుఁడు ననిలుఁడు, హరుఁడున్ సంపాతి యనఁగ నల్లనలువురున్
     బురుషార్థంబులవలె నొ,ప్పిరి రాఘవ వారెకద విభీషణమంత్రుల్. 251

మ. ఇటు లమ్మాల్యవదాదు లాత్మజులతోఁ నింద్రాదిదిక్పాలకో
     త్కటసంపద్గరిమంబుతోఁ ద్రిభువనత్రాసప్రదోద్యద్భటో
     ద్భటధాటీఘటితార్భటీపటిమతోఁ దా రందఱున గూడి ము
     న్పటిలీల గరడోరగామరమునీంద్ర శ్రేణి బాధింపఁగన్ . 252

                  §§§ సురలు మునులు శివునిపాలి కరిగి యసురులం బరిమార్ప వేఁడుట §§§
ఉ. వారియుపద్రవంబున నివారిత వైభవు లై సమస్తబృం
     దారకులు వసింపఁ దగుతా విఁక నెయ్యది యేది త్రోవ యె
     వ్వారికి విన్నవింపుదము వైరులరా పని చింతఁ జేసి యి
     బ్బారి పురాపహారి యెడఁబాపఁ గలాఁ డని నిశ్చితాత్ములై. 253

తే. శ్వేతరుచిభూతిఁ దగి భవ్యశృంగకలనఁ, దనరి గజముఖసంయుక్తిఁ గని యనంత
     పాదకటకాప్తి నెంతయు బాగు మీఱి, శివునివలె నున్న కైలాసశిఖరిఁ జేరి,254

సీ. అహిరాజ భూషణుం డైనయా వేల్పు మాయహిభయం బేరీతి నడఁచు ననక
    యెపుడుఁ గుత్తుక విషం బిడుకొని మాటాడు నితనిమాటలు నమ్ము టెట్టు లనక
    తనవారితనముతోఁ గనుఁ బుణ్యజనుల నీయన పుణ్యజనవైరి యౌనె యనక .
    త్ర్యంబకుం డితఁ డనేకాంబకుల్ దేవతారివు లెట్టువారి నిర్జించు ననక
తే. యల సుకేశకుమారసంహారమునకు
    నెట్టు లొడఁబడు నితఁ డన కింద్రముఖ్యు
    లటుల యాపన్నులై భద్రవటమునీడ
    నిండుకొలు వున్న పార్వతీనేతఁ గనిరి. 255

క. కనివినయముభయమును బెనఁ,గొనఁగరములు మొగిచి శివునకును బహుసాష్టాం
   గనమస్కృతు లొనరిచి యి,ట్లని పొగడిరి మునులఁగూడి యమరేంద్రముఖుల్

   మత్తేభగర్భితసీసము
   అభవ కందర్పమదాప హానలదృశా పద్మారికోటి ప్రభా జోహారు