పుట:Uttara Ramayanamu Kankanti Paparaju.pdf/61

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమాశ్వాసము

37


    దనుజ త్రయీతపోదమునస్స్ఫులింగముల్ మహనీయముకుటాగ్రమణులనొరయ
    దైత్య మూర్ధన్య మూర్ధజతపశ్ళిఖశిఖాచయముచే సావిత్రి మెయి సెమర్చ

తే. నుగ్రనిష్ఠాగరిష్ఠు లై యుగ్ర మహిమ, నుగ్ర తపమును గావించుచున్న రాక్ష
    సాగ్రణుల చెంత కరుదెంచి యట్టెకాంచి, వెఱఁగుమించి విరించి దీవించి యనియె. 226

ఉ. ఇంకఁ బ్రయాస మొంద వలదే మిము మెచ్చితిఁ గోర్కు లిచ్చెదన్
    శంకఁ దొఱంగి లెం డసురశంకరులార యటంచు భారతీ
    పంకజలోచనాకచవిభాసురకేసరవాసనాగతా
    హంకరణాళిఝంకరణహారిమృదూక్తుల నానతిచ్చినన్ . 227

మ. అమృతాంభోధితరంగ ఘుంఘుమరవోద్యత్తన్మృదూక్తిన్ గత
     శ్రము లై కన్నులు విచ్చి రాక్షసులు సాక్షాత్కార మైయున్న బ్ర
     హ్మాముఖాంభోజముఁ జూచి లేచి భయకంపావా ప్తి సాష్టాంగదం
     డము లర్పించి నుతించి రిట్లని లలాటన్యస్తహస్తాబ్జులై . 228

మ. పురుషుం డంచుఁ బరేశ్వరుం డనుచు వేల్పుంబెద్ద యంచు మహే
     శ్వరఁ డంచుం బరమాత్ముఁ డంచు శ్రుతిశాస్త్రజ్ఞాన పారీణు లే
     ర్పఱుపం జాలక పెక్కు భేదముల నేభవ్యాత్ము నూహింతు రా
     పరమేశున్ నినుఁ గొల్తు మేము శుభముల్ ప్రాపింప నశ్రాంతమున్. 229

శా. ఆశాస్యంబులు నీవలెన్ నతుల కీయన్ జాలు జేజే గలాఁ
     డే శశ్వత్కృప మాయెడన్ నిలిపి తండ్రీ ప్రోచెదేనిన్ సమ
     స్తాశాధీశ జయప్రతాపములు దీర్ఘాయుస్సదారోగ్యవి
     ద్యాశాలిప్రతిభల్ పరస్పరహితత్వంబున్ బ్రసాదింపవే. 230

క. ప్రభవిష్ణుల మై యెందును, నభివృద్ధి వహింతు మనుచుఁ బ్రార్థించినఁ బ
    ద్మభవుం డాదరమున న,య్యభిమతము లొసంగి చనియె నాత్మీయులతోన్ .231

వ. అంత. 232

                                    §§§ మాల్యవదాదులు లోకంబుల బాధించుట §§§
శా. భాషానాథవరప్రదానవిలసద్భాహాబలాటోపు లై
    దోషాటాధిపతుల్ మదాంధత సుధాంధోముఖ్యులన్ గెల్చి త
    ద్యోషారత్నములన్ గ్రహించి మునులన్ దూలించి సాధ్యాదులన్
    రోషాగ్నిన్ దపియింపఁ జేసి సురవైరుల్ మెచ్చ వర్తించినన్ . 233

 సీ. పట్టు గానక బయల్ వట్టి రాదిత్యులు ఖచరుల త్రోవలు గట్టువడియె
     దీను లై గరుడులు దెస సెడి పాఱిరి తుషితులు బడలికతోఁ దిరిగిరి
     వసువులు పేదలవలె గాసిఁ జెందిరి గమిఁ బాసి రుద్రులు గాడుపడిరి
     యడ్డగింపులకు లోనైరి మరుత్తులు చేరిరి గిరిగుహల్ సిద్ధవర్యు