Jump to content

పుట:Upanyaasapayoonidhi (1911).pdf/119

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

96

ఉపన్యాసపయోనిధి.

ఈశ్వరునుండి వచ్చినపదార్ధము ఎప్పటికిని ననీశ్వర పదార్ధము గాఁజాలదుకదా? అగుననునెడఁ బులికి మేక పుట్టుననియు మామిడివిత్తువలన పనసచెట్టు పుట్టుననియుఁ గూడఁ జెప్పవచ్చునుగదా? అట్లు చెప్పఁగూడదని యందఱును నంగీకరించియున్నారుగాన నీశ్వరునుండి యనీశ్వర పదార్ధము కలుగుననుటకు వలనుబడదు. వీని నన్నిటిని గనియేకాఁబోలు ! పాపము! పంతులవారును నద్వైతమునుగూర్చి "శంకరాచార్యులు" అను వ్యాసములో నిట్లువ్రాయించియున్నారు.

"అద్వైతమతము యుక్తిచేత చక్కఁగానే కానఁబడినను అనుష్ఠానమునకు మాత్రమంతగా అర్హ మైనదికాదు'- పుట 501 సం॥ 8 పుట వంతులవా రద్వైతము యుక్తియుక్తమేయని యంగీకరించిరి కదా. ఇఁకదీని నధిక్షేపింపఁ బోనేల ? యుక్తియననేమో శ్రీ శ్రీపంతులవారేయిట్లు వ్రాయించియున్నారు.

“ఇంద్రియములకు గోచరములైన విషయములవలన మనము పొందిన యనుభవమును దెలియని విషయములయందుఁ జొప్పించి కార్యకారణ సంబంధముతో విమర్శించినమనకుఁ దోఁచునట్టి యభిప్రాయములు యుక్తులుగాని తద్భిన్నములైన వెల్లయుక్తులు కావుగదా.”

ఈనిర్వచనముంబట్టి యద్వైతము యుక్తి యుక్త మ ని పంతులవారు చెప్పిరన తమ యింద్రియములకు గోచరములై