ఈ పుటను అచ్చుదిద్దలేదు
ఈ కీర్తనలు ఒకచోట క్రోడీకరించి, మంచి సులభ సంప్రదాయ శైలిలో స్వరపరచడంలో మిత్రులు, ప్రముఖ సంగీత విద్వాంసులు శ్రీ వోలేటి వేంకటేశ్వరరావుగారితో కలిసి యధాశక్తి గా కృషిచేసే సదవకాశం లభించినందుకు నెనెంతో సంతోషిస్తూ, వారికి నాధన్యవాదాలు తెల్పుకుంటున్నాను.
ఈ కీర్తనలు స్వరసహితంగా తయారుచేయించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రే సంగీత సభల సమాఖ్య, వాటిని ముద్రించడానికి సంకల్పించిన ఆంద్రప్రదేశ్ సంగీత నాటక అకాడమీ కార్యకర్తలకూ నా అభినందనలు.
ఇవి గ్రంధరూపంలో రాగానే రసజ్ఞలు, సంగీత కళాభిమానులు, ప్రత్యేకించి గాయక, గాయనీమణులు, విద్యార్ధులూ - అందరూ దీనిని అదరించడమే గాక, అందులోని కీర్తనలన్నింటిని గానం చేసి ధన్యులు కాగలరని ఆకాంక్షిస్తున్నాను.
ద్వారం భావనారాయణరావు
విజయవాడ 18-10-1977