పుట:Tikkana-Somayaji.pdf/61

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

52

తిక్కన సోమయాజి

వ. అప్పుడు బౌద్ధదేవాలయంబులు గూలం ద్రోయించి గణపతిదేవరాజు సోమయాజుల పటువాక్యశక్తి మెచ్చి యతని౯ బహుప్రకారంబులఁ బూజించి యెనిమిది గ్రామంబు లొసంగి యతఁడు వచ్చినకార్యం బడగిన నాభూవరునకుఁ గవివరుం డిట్లనియె.

గీ. ఇనకు లోద్భవుఁ డైనట్టి మనుమసిద్ధి
   రాజు నెల్లూరు పాలించుచోఁ జెలంగి
   యతనిదాయాదు లతని నుక్కఱగఁ బట్టి
   యునిచి రాజ్యంబుఁ దమ రేలు చున్నవారు.

క. కావున మీ రిపు డచటికి
   వేవేగం దరలి వచ్చి విడకుండఁగ నా
   భూవరుఁ బునరభిషిక్తునిఁ
   గావింపఁగ వలయు ననిన గణపతివిభుఁడున్.

గీ. అట్ల కాకయనుచు నాపని కొడఁబడి
   య త్యుదారగుణసమగ్రుఁ డగుచు
   దవిలి యప్పు డొక్కనవలక్షధనమును
   యజ్ఞ కుండలములు నతని కిచ్చె.

క. పనుచు నెడఁ దిక్కమఖి యా
   జనవరు సింహాసనమున సచివాగ్రణి యై
   తనరెడు శివదేవయ్యన్
   గనుఁగొని యారాజుతోడ గడఁకం బలికె౯.

గీ. వసుమతీనాథ యీతఁ డీశ్వరుఁడు గాని
   మనుజమాత్రుండు గాఁడు పల్మాఱు నితని
   యనుమతంబున నీవు రాజ్యంబు నెమ్మి
   నేలు మనిచెప్పి యాఘనుఁ డేగుటయును.