పుట:Tikkana-Somayaji.pdf/131

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

2


1. భారతధర్మ దర్శనము.

గ్రంథకర్త: గవర్ణమెంటు తెలుగు ట్రాన్సులేటరగు చన్నాప్రగడ భానుమూర్తిపంతులుగారు, బి.ఏ., ఎల్ , టి.

తృతీయముద్రణము.

నిర్మలదేశాను రాగమునుబోధించు 109 పద్యములు. ప్రతిఆంధ్రుడును చదివి తీరవలసినదే చందాదారులకు రు. 0-1-6 లకు ఇతరులకు రు. 0-2-0 లు.

3. షీష్వానారాయణరావు వధ.

గ్రంథకర్త:-- నేమవరపు రామదాసుపంతులుగారు, బి.ఏ., బి.ఎల్.,

ఈ కథ మన యాంధ్రదేశమున నాటకరూపమున ప్రదర్శింపబడు చుండుటచేత ఆంధ్రులందరికిని తెలిసియేయున్నది. ఈగ్రంథమునందు పీష్వానారాయణరావు, పీష్వామాధవరావు, రగోబాల బొమ్మలును, షీష్వా నారాయణరావు వధయొక్క బొమ్మయును ప్రకటింపబడినవి. మృదుమధురశైలి. వెల చందాదారులకు 0-1 -6 ఇతరులకు 0.2–0.

8. స్వాతంత్ర్యదర్శనము.

గ్రంథకర్త:- దుగ్గిరాల రామమూర్తి పంతులుగారు, బి.ఎ., ఎల్ , టి,,

జాన్ స్టూఆర్టు మిల్లు ఆసు ఆంగ్లేయ పండితోత్తముని లిబర్టీ అను ప్రసిద్ధ గ్రంథముయొక్క, భాషాంతరీకరణము. నెల చందాదారులకు రు. 0-7-0 లు. ఇతరులకు రు. 0-12-0 లు..

9. మహారాష్ట్ర చరిత్ర.

గ్రంథకర్త:-చిల్లరిగె శ్రీనివాసరావు పంతులుగారు, బి. ఏ.

ఏ హైందవుడైనను నిన్న గాక మొన్నటివరకు స్వరాజ్య సుఖమనుభవించిన మహారాష్ట్ర సోదరుల పవిత్రచరిత్రమును చదువుకుండుట హాస్యాస్పదముగదా. మహాదేవ గోవిందరానడే మొదలగు మహనీయులచేవ్రాయబడిన గ్రంథ సహాయముచే మృదుమధుర శైలిని వ్రాయబడిన ఉద్గ్రంథము.

హిందూదేశ పటమునుఁ శివాజీ, రామదాసస్వామి, రాజావెంకాజీ, తారాబాయి, సాహుమహారాజు, పీష్వాబాజీరావు, అహల్యాబాయి మొదలగు 22 చిత్రపట శోభితమయి యున్నది