పుట:Tikkana-Somayaji.pdf/119

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

110

తిక్కన సోమయాజి

"ఆ. జరణములును నడుముఁ జన్నులుఁ గన్నులు
     జవ్వనంబు చెన్ను నివ్వటిల్లు
     చునికిఁ దెలుపుచుండ నుత్తర సనుదెంచె
     నలరుమరునిపువ్వుటమ్మువోలె."

అనుపద్యమునే శాంతిపర్వ ప్రథమాశ్వాసములో సృంజయరాజు కూఁతును నారదుఁడు మోహించినకథను జెప్పుచు దాని వర్ణనసేయుచు నాఁటవెలదిగీతి 3, 4 పాదములనుఁ "ఉనికి దెల్ప సృంజయునిపుత్త్రి మెలఁగు విధంబు నారదునకుఁ దగులొనర్చె" అని మార్చి ప్రయోగించి యున్నాఁడు.

భీష్మపర్వము మొదట సంజయుఁడు ధృతరాష్ట్రునకు భీష్ముశరతల్పగమనమును జెప్పునప్పుడు వ్రాసిన

"సీ. ఆత్మయోధుల కెల్ల నాధార మగునట్టి
            తనకు నస్త్రంబు లాధార మయ్యెఁ
    బరశురామునకు మేల్సరియైన తనయందుఁ
            గలిగె భంగంబు శిఖండిచేత
    జనపతి దనునచ్చి మునుజూద మొనరించెఁ
            దాను గయ్యంపుజూదమునఁ నోడెఁ
    దనయార్పు టెలుగునఁ దలకు వైరులు
            వొంగ నొఱలుచు నేలకు నొఱఁగె నేఁడ

 ఆ. తీవ్రబాణజాలదీప్తులు పరగించి
     పాండు తనయసైన్యబహుళతమము
     లీలఁ బదిదినంబు లోలిమై విరియించి
     యధిప భీష్మభానుఁ డస్తమించె."