పుట:Tikkana-Somayaji.pdf/108

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తొమ్మిదవ యధ్యాయము

99


"క. భూరిభవత్కారుణ్య
    క్షీరాంబుధి సాదుతుచ్చచిత్తంబున వి
    స్తారమహితముగ నునిచితి
    వారయ నచ్చెరువుగాదె యఖిలాండపతీ.

ఉ. ఇంతకు నేర్చునీకు నొకయింతటిలోన మదీయవాణి న
   త్యంతవిభూతిఁ బెం పెసఁగు నట్టినినుం గొనియాడఁజేతఁదా
   నెంతటిపెద్ద నీకరుణ నిట్లు పదస్థుఁడ నైతి నింకజ
   న్మాంతరదుఃఖముల్ దొలఁగునట్లుగఁ జేసిసుఖాత్ముఁజేయవే."

అని యుపలాలితుఁ డగుబిడ్డఁడు తనకొలఁది యెఱుంగక మహాపదార్థమును వేడువిధముగా బ్రహ్మనందస్థితం గోరి యా జగన్నాధునకు మరల సాష్టాంగ నమస్కారం బాచరించె నఁట. అప్పుడు భగవంతుఁడు ప్రసన్నముఖుఁ డై యిట్లు పలికె నఁట.

"తే. జనన మరణాదు లైన సంసారదురిత
    ములకు నగపడకుండంగఁ దొలఁగుతెరువు
    గనువెలుంగు నీకిచ్చితి ననిన లేచి
    నిలిచి సంతోష మెదనిండ నెలవుకొనఁగ."

అంతఁ దిక్కన మేలుకాంచె నఁట. అంత భక్తితాత్పర్యములు మానసంబున ముప్పిరిగొన నతం డిట్లు ప్రతిజ్ఞాదికమును జేసెను.

“ఉ. ఇట్టిపదంబుగాంచి పరమేశ్వరునిం గృతినాథుఁ జేసి యే
     పట్టునఁ బూజ్యమూర్తి యగుభారతసంహితఁ జెప్పఁ గంటినా
     పుట్టుఁ గృతార్థతం బొరసెఁ బుణ్యచరిత్రుఁడ నైతి నవ్విభుం
     గట్టెదఁ బట్ట మప్రతిమకారుణికత్వమహావిభూతికిన్.