62
తిమ్మరుసు మంత్రి
వీరనరసింహదేవరాయని పరిపాలనము.
వీరనరసింహరాయఁడు తనతండ్రియైన నరసింగరాయఁడు సాహసింపఁజాలని కార్యమునకుఁ దానొడిగట్టి యిమ్మడి నరసింగరాయనిఁ దోసిపుచ్చి తానే రత్నసింహాసన మాక్రమించుకొని తిమ్మరుసు తన్నుఁ బట్టాభిషిక్తునిఁ జేయ నవక్రపరాక్రముఁడై పరిసంధిరాజుల నుక్కడంచి ధరావలయమును బరిపాలించి మహారాజాధిరాజు, రాజపరమేశ్వరుఁడు, రోషకృతప్రతిపార్థి పదంపాడుఁడు, శేషభుజక్షితిరక్షణశౌండుఁడు; భాషిగెతప్పువరాయరగండఁడు, మూరురాయరగండడు, పరరాజ భయంకరుఁడు, హిందూరాయసురత్రాణుఁడు, దుష్టశార్దూల మర్ధనుఁడు, గజౌఘగండభేరుండుఁడు మొదలగు ప్రసిద్ధబిరుదములనుబొంది యాఱేండ్లు పరిపాలనము చేసెను. అదివఱకు సంపాదించిన దేశములను జక్కబఱచుకొని సామ్రాజ్యమును స్థిరపరచుకొనుటకు మాత్రమె ప్రయత్నించెను గాని గజపతులను, అశ్వవతులను జయించుటకుఁ దలఁపెట్టియుండలేదు. ఆకార్యమును బూనకపూర్వమే క్రీ. శ. 1509 వ సంవత్సరములో జాడ్యగ్రస్తుఁడై కాలధర్మము నొందుట సంభవించెను. అతఁడు మరణముఁ జెందునప్పటికిఁ నాతనికిఁ దిరుమలదేవరాయడను నెన్మిదేండ్ల వయస్సుగల కుమారుఁ డొకఁడుండెను.
వీరనరసింహరాయని దుష్టబుద్ది.
వీరనరసింహరాయఁడు కుటిలస్వభావుఁడనియుఁ గ్రూరచిత్తము గలవాడనియు మొదటనే చెప్పి యున్నాఁడను,