తెనాలి రామకృష్ణకవి చరిత్రము
5
కాకమాను రామరాజ భూషణుడు, ప్రౌఢకవి మల్లన్న, పింగళి సూరన్న తెనాలి రామకృష్ణకవి—వీ రష్టదిగ్గజములని, కీర్తి గాంచిరి.
2 బాల్య ము
రామకృష్ణకవి బాల్యావస్థలో నున్నపు డపరిమితముగ నల్లరి సేయుచు తలిదండ్రులమాట పాటింపక తిరుగుచుండెను. ఈతఁడొకనాఁడు కొందరు బాలురతోకలిసి యాటలాడు చుండగా, నామార్గమున బోవుచుండిన సిద్ధుడొకఁడాగి, రామకృష్ణుని ముఖమువంక తదేకదృష్టిగఁజూచి, రమ్మని పిలచి యిట్లనెను ఓ బాలుడా! నాతో దూరము వత్తువేని నీకుమేలు కలిగించెదను,
రామకృష్ణుఁ డాసిద్ధునియెడల గౌరవయుక్తుఁడై యనుసరించెను. కొంతదూరము గొనిపోయి యాసన్యాసి, ఓ బాలుడా నీ ముఖమున నసాధారణమగు తేజముప్రస్ఫుటమగుచున్నది. నీకు గాళికామంత్రము నుపదేశింతును. భక్తి, ముక్తుడవై , దేవి యాలయమునకు బోయి గర్భగుడిలో గూర్చుండి, జపింపుము, నీకు మేలు కలుగును. అనియొకమంత్రము నుపదేశించి వెళ్ళెను.
రామకృష్ణుడు నిర్భయచిత్తుడై "కాళికాలయమునకు బోయి యేకాగ్రచిత్తముతో నామంత్రమునుజపింపగా, దేవి సంతుష్టినొంది సాక్షాత్కరించెను. దయార్దహృదయమై దేవిప్రత్యక్షమైనంత నే రామకృష్ణకవి భక్తి యుక్తుఁడై ధ్యానించుటకుమారు ఫక్కుననవ్వెను. కాళికాదేవి యాగ్రహమునొంది “ఏమిరా' నన్ను చూచి నవ్వెదవు అని గర్జించెను. భయభక్తులు తన్ను ముప్పిరిగొన నాతడు 'అమ్మా! నన్ను క్షమింపుము నేను నీదాసుడను, నీరూపము చూడగానే నా చిత్తము సందేహాయత్తమైనది” అనెను.