డుట శ్రేయోదాయకమని నాయభిప్రాయము. ఈ యభిప్రాయమును ఈ పుస్తకమందేగాక యింతకు ముందు నాచే రచింపఁబడిన యితర గ్రంథములలోఁ గూడ వెల్లడిచేసితిని.
ఈ పుస్తకపు తుదిభాగము నే గ్రామాంతరమున నుండు నవసరమున ముద్రింపఁబడిన దగుటచే నచ్చటచ్చట గొన్ని ముద్రాస్ఖాలిత్యములు దోపవచ్చును. అట్టి వానిని రెండవ కూర్పున సరిచేసికొందును.
సంఘ విషయములఁ గూర్చి అబాధకములగు చమత్కార కావ్యములు మనదేశభాషలలో లేవు. ఐరోపాఖండమువారి ప్రస్తుత నాగరిక ప్రవర్తనమునకు కారణభూతములైనవి యిట్టి కావ్యములేయని నేను జెప్పనవసరములేదు. కనుక చదువరులారా! యీపుస్తకమున నుండు విశేషములను, వర్ణనలను గురించి మనసున వేరుగాఁ దలంపక నాయుద్దేశము నాలోచించి మన్నించి చదివి తక్కిన భాగములు కూడా త్వరలో వెలువడునటుల నన్ను ప్రోత్సాహపఱచెదరని నమ్ముచున్నాను.
దాసు శ్రీరాములు
శ్రీరస్తు.
తెలుఁగునాడు
(స్తుత్యాదికము.)
ఉ. శ్రీపరమున్ మహేశుని భ
జించి రసంబు ఘటింప గాళహ
స్తీపురమున్ బురాణపురి
శ్రీగిరి యెల్లలుగాఁ దలిర్చు నా
నాపుర మానితం బయిన
నాఁటఁ జెలంగు దెలుంగుఁబల్లెలన్
గాపుర ముండువారల ప్ర
కారము వీథి యొనర్తుఁ గ్రొత్తగన్.
ఉ. లోకవితాన మేలు పరలోకవిభు డఖిలంబు గూర్చెనౌ
నా కవితాకునన్ ధనమునం బరితృప్తులు గాక నిక్కువా
రా కవితారసంబు కెనయంగల రిద్దమరేయి దొంగకున్
రా కవితంబ యయ్యవి నిరాకుల చిత్తులపాలి భాగ్యముల్.
చ. తెలుఁగునఁ దేటతెల్లముగఁ దెల్పినమాట వరాలమూటగాఁ
దెలుఁగున మాటలాడు మనదేశపువారు గణింతు రందుకై