పుట:Telugu Right to Information Act.pdf/12

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పౌర సమాచార అధికారి లేక రాష్ట్ర పౌర సమాచార అధికారి దరఖాస్తుదారుకు ఈ కింది విషయాలు తెలియజెపుతూ నోటీసు ఇ‌వ్వాలి.

(ఎ) కోరిన రికార్డల్లో వెల్లడి నుంచి మినహాయింపు పొందిన భాగాన్ని విడదీసి మిగతా భాగాన్ని మాత్రమే వెల్లడి చేస్తున్న విషయం.
(బి) ఆ నిర్ణయానికి గల కారణాలు, నిర్ణయానికి ముందు పరిశీలనలో వెల్లడి అయిన అంశాలు, వాటికి సంబంధించిన విషయాలు.
(సి) నిర్ణయం తీసుకున్న వ్యక్తి పేరు, హోదా
(డి) ఆ వ్యక్తి నిర్ణయించిన రుసుము వివరాలు, దరఖాస్తుదారు చెల్లించాల్సిన రుసుము వివరాలు.
(ఇ) నిర్ణయం పునఃపరిశీలించ కోరేందుకు దరఖాస్తుదారుకున్న హక్కులు. వసూలు చేసే రుసుము వివరాలు, పునఃపరిశీలన కోరేందుకు గల మార్గాలు. సెక్షన్ 19 లోని సబ్ సెక్షన్ (1) కింద నియమితులైన సీనియర్ అధికారి లేక కేంద్ర సమాచార కమీషన్ లేక రాష్ట్ర సమాచార కమీషన్ వివరాలు, పునఃపరిశీలన కోరేందుకు ఉన్న కాలపరిమితి , పద్ధతి ఇతర వివరాలు.

11. (1) తృతీయ పక్షానికి చెందిన సమాచారం లేక తృతీయ పక్షం అందించిన సమాచారం, దానిని గోప్యమనదిగా ఆ తృతీయ పక్షం భావిస్తున్నప్పుడు, అలాంటి సమాచారాన్ని చట్టం కింద వెల్లడి చేయాలని కేంద్ర పౌర సమాచార అధికారి లేక రాష్ట్ర పౌర సమాచార అధికారి భావించినపుడు, ఆ సమాచారం కోసం అభ్యర్ధన అందిన అయిదు రోజుల లోగా కేంద్ర పౌర సమాచార అధికారి లేక రాష్ట్ర పౌర సమాచార అధికారి సదరుతృతీయ పక్షానికి ఆ ఆభ్యర్ధన గురించి రాతపూర్వకమైన నోటీసు ఇవ్వాలి. దరఖాస్తుదారు కోరిన రికార్డు లేక సమాచారం లేక అందులో కొంత భాగం వెల్లడిం చేయాలని భావిస్తున్నట్లు తెలుపుతూ, అలా వెల్లడి చేయవచ్చో లేదో మౌఖికంగా గానీ, లిఖితపూర్వకంగా గానీ దఖలు చేయాల్సిందిగా తృతీయ పక్షాన్ని ఆ నోటీసులో కోరాలి. సమాచారాన్ని వెల్లడి చేయాలన్న నిర్ణయం తీసుకునే ముందు తృతీయ పక్షం దఖలును పరిగణనలోకితీసుకోవాలి. చట్టం పరిరక్షిస్తున్న వాణిజ్య, వ్యాపార రహస్యాలను మినహాయించి ఏదైనా సమాచారం వెల్లడి తృతీయ పక్షానికి కలిగించే హానికన్నా ప్రజా ప్రయోజనాలకు చేకూర్చే మేలు ఎక్కువని భావించినపుడు ఆ సమాచారాన్ని వెల్లడి చేయవచ్చు.

(2) సబ్ సెక్షన్ (1) కింద ఒక తృతీయ పక్షానికి నోటీసు ఇచ్చినపుడు , ఆ నోటీసు అందిన నాటి నుంచి పదిరోజులలోగా సమాచార వెల్లడిప్రతిపాదనపై తమ వాదన దాఖలు చేసుకునేందుకు ఆ తృతీయ పక్షానికి అవకాశం ఇవ్వాలి.
(3) సెక్షన్ 6 కింద సమాచారం కోరిన అభ్యర్ధన అందినపుడు, సబ్ సెక్షన్ (2) కింద తమ వాదన వినిపించేందుకు తృతీయ పక్షానికి అవకాశం ఇచ్చినతర్వాత, అభ్యర్ధన అందిన నాటి నుంచి 40 రోజుల్లోపు సెక్షన్ (7) లోని నిబంధనలతో నిమిత్తం లేకుండా కేంద్ర పౌర సమాచార అధికారి లేక రాష్ట్ర పౌర సమాచార అధికారి ఆ సమాచారాన్ని లేక రికార్డులను లేక అందులోభాగాన్ని వెల్లడి చేయాలా వద్దో నిర్ణయించి, తమ నిర్ణయాన్ని నోటీసు ద్వారా తృతీయ పక్షానికి తెలియజేయాలి.
(4) సబ్ సెక్షన్ (3) కింద ఇచ్చిన నోటీసులో, ఆ నోటీసు అందుకున్న తృతీయ పక్షానికి అందులోని నిర్ణయంపై, సెక్షన్ 19 కింద అప్పీలుకు వెళ్లేందుకు హక్కు ఉందని కూడా తెలియపరచాలి.