పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/97

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
సంగీత రత్నాకర సౌరభం:

ఇమ్మడి ప్రౌఢదేవరాయ లనబడే మల్లికార్జున దేవరాయల కాలంలో (క్రీ.శ. 1416-1465) చతుర కల్లినాథుడు రచించిన కళానిధి నామం గల సంగీత రత్నాకర వ్యాఖ్యానం విజయనగర రాజుల కాలంలో వెలువడిన గ్రంథాలలో వుత్తమమైంది.

రెందవ దేవరాయల కాలంలో దుర్గ పాలకుడైన గోపేంద్ర తిప్పరాజు 'తాళ ' దీపిక, అనే ప్రత్యేక తాళ లక్షణ గ్రంథాన్ని రచించాడు.

కళింగాధిపతియైన వీరరుద్ర గజపతి, కృష్ణదేవరాయల పోషణలో వున్న లొల్ల లక్ష్మీధరుడు తన పూర్యులలో అయిదవ తరంవాడైన విరించి మిశ్రుడు 'భరార్ణవ పోత' మనే నాట్యగ్రంథాన్ని రచించినట్లు తన సౌందర్య లహరి వ్యాఖ్యానంలో ఉదహరించాడు.

దేవాలయానికి దివ్యదానం తెచ్చిన దేదాసి:

క్రీ.శ. 1433-34 స॥రంలో మడమను గ్రామంలో అగ్నీశ్వర దేవాలయానికి దేవాసి 'అరంవళత్త నాచ్చియార్ ' అనే తమిళ దేశపు దేవదాసి. ఆమె రెండవ దేవరాయల్ని దర్శించి, అతని వలన ఒక దేవాలయం కొరకు దానం పొందింది. రాయల కాలంలో దేవదాసీలు నాట్య కళలో అద్భుతమైన ప్రావీణ్యాన్ని కలిగి వుండే వారు. రాజాదరణకు పాత్రమైన దేవదాసీలు గృహాలేకాక గృహారామాలను కూడ స్వంతంగా కలిగివుండే వారు

విజయనగర రాజధాని హంపిలో వున్న శిల్పసంపదలో గాయక, నర్తక, నర్తకీ బృందాలు సంప్రదాయ శుద్ధమైన భరతనాట్య భంగిమలతో బహు సంఖ్యలు విరాజిల్లుతున్నాయి. కోలాటపు కోపుల శిల్పాలు అనేకం గోడలమీద చెక్కబడి వున్నాయి..