పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/713

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పీర్ల పండుగలో మొహరం గీతాలు

681


ఆకాసిపట్నాన అందాల కోటా
అందాల కోటలో అద్దాల మాలూ ॥నీకి॥

అద్దాల మాలులో గెద్దె పీటల్లు
సురతీల సొగసుల్ల సుంవాసనలూ ॥నీకి॥

గెద్దె పీటల మీద ఇద్ద రెవ్వారు
అసేని వూసేని అన్నదమ్ముల్లు ॥నీకి॥

రచ్చనా రాజుల్లు తగువునా దొరలు
ఏడేడు దీవుల్ని యేలు పొచ్చాలు

ఇలా ఎన్నో పాటలు సాగిపోతాయి. హసన్, హుస్సేన్ వీరులను కీర్తిస్తూ అనేకమైన మొహరం గీతాలు ఆంధ్రదేశమంతటా ప్రచారంలో వున్నా రాయలసీమలో ఎక్కువగా వున్నాయి. వ్రాసిన వారందరూ ఇతర కులాలవారే. ఇద్దరు అన్నదమ్ముల త్యాగాలను ముస్లిములు ఎలా కీర్తిస్తారో ఇతర కులాల వారు కూడా అలాగే పూజిస్తారు.

ఈ తెలుగు మొహరం గీతాలు జానపదులు ఎంతో భక్తితో పాడుకుంటారు. పని పాటల్లో కష్టాన్ని మర్చి పోతూ పాడుకుంటారు. ఈ మొహరం గీతాలను ఆచార్య తూమాటి దోణప్ప గారు తమ జానపద కళాసంపదలో వ్రాశారు. వారికీ, ఆ పాటలు వ్రాసిన వారికీ ధన్యవాదాలు.

ఈనాడు ఎక్కడో చెదురు మదురుగా తప్ప పీర్ల పండుగలు పూర్వంలా జరగటం లేదు. ఈ తరం వారికి ఈ పీర్ల వండుగను గురించి మొహరం గీతాలను గురించీ అంతగా తెలియదు.