పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/390

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సలాది భాస్కర రావు (కాకినాడ), కొచ్చర్ల మల్లేశ్వరి, ముని ముని లక్ష్మి, కరకాంపల్లి, (చిత్తూరు జిల్లా), ఎ. రంగమాంబ భాగవతారిణి (తిరుపతి) , నదితోక రూపకుమారి ( పార్వతీ పురం), తూములూరి లక్ష్మణ శాస్త్రి. (విజయవాడ), సి.హెచ్. లక్ష్మీనరసింహాచార్యులు ఉప్పల్ (హైదరాబాదు) , తరకటూరి లక్ష్మీ రాజ్యం భాగవతారిణి (మచిలీ పట్నం), మంగిపూడి వెంకటరమణ మూర్తి ( రాముడు వలస), ముప్పవరపు వెంకట సింహాచల భాగవతారు, (పాత గుంటూరు), వీరగంధం వేకట సుబ్బారావు భాగవతారు ( తెనాలి), కలికివాయి విజయ శ్రీ, భాగవారిణి (తాడేపల్లి గూడెం) మహారెడ్డి శ్రీనివాసరావు (నరసన్న పేట), సంగమారాజు మణి భాగవతారు (సత్యవీడు), గరిమెళ్ళ సత్యవతి భాగవతారిణి (మదనపల్లి), నిడుముక్కల సాంబశివరావు, అరండల్ పేట,(గుంటూరు), గునపల్లి సూర్య నారాయణ భాగవతార్, నాంపల్లి, (హైదరాబాదు). పునుగు శేషయ్య శాస్రి, మెహిదిపట్నం (హైదరాబాదు), వేరేకాక తూర్పు గోదావరి జిల్లాలో వోడారేవు రామారావు, వేదంభట్ల వెంకట రామయ్య, సూర్తావారు, మరువాడ రామమూర్తి, బాలాంత్రపు లలిత కుమార్ మొదలైన వారెందరో రాష్ట్ర వ్యాపితంగా హరికథా గానం చేసి పేరెన్నిక గన్నారు. పైన ఉదహరించిన వారిలో అనేక మంది కీర్తి శేషులయ్యారు. మరెంతో మంది వృద్ధాప్యంతో బాధలు పడుతున్నారు.

పై నుదహరించిన హరికథా గాయకుల వివరాలను బెంగుళూరి మేలు కలయిక వ్వవస్తాపకుడు డి.ఆర్. శ్రీనివాస మూర్తిగారు నాకు అంద జేసి ఎంతో సహకారం అందించారు, వారికి నా కృతజ్ఞలు. ఇంకా మరెందరో

హరి కథా గాయకులు వుండవచ్చు. కావాలని ఎవరినీ విస్మరించ లేదు. వారి సమాచారం కాను అందక పోవటం వల్ల వారి పేర్లూ ఉదహరించ లేక పోయినందుకు విచారిస్తున్నాను,.