పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/351

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అంటూ వివిధ కథలలో వివిధ ఘట్టాల ననుసరించి భళి భళీ,అరెరే, అనీ, హరి హరీ అనీ, అయ్యో అనీ, ఒరేయ్ అనీ, శహభాష్ అనీ, వహ్వా అంటూ కథకునికి ఊత యిచ్చి కథను రక్తికట్టిస్తారు.

బుర్ర కథ రగడలు:

జంగం కథల్లో బుర్ర కథల్లో ఆయా రచయితలు ఎవరికి వారు వారి ధోరణిలో ఎన్నో రగడలను కీర్తనలను బాణీలను వివరించారు. అలా సుంకర సత్యనారాయణ గారు కథలకు ప్రార్థన ఈ విధంగా వివరించారు.

ప్రార్థన:

మాతృ దేశము కొరకు మరణించు భక్తుల పూలతో పూజింపరావ ॥మా॥
స్వాతంత్ర్య పోరాటములలో చావు బ్రతుకో తేల్సు కొనెడి
వీర దేశ సేవాకులకు వేగ రార పూజ సేయ ॥మా॥

ఇలా ప్రార్థన అయిన తరువాత పల్లవితో కథ ప్రారంభ మౌతుంది. అలా నాజరు వ్రాసిన పల్నాటి వీర చరిత్రలో

వినరా భారత వీర కుమారా
విజయము మనదేర.
వినరా ఆంధ్రుడ పల్లనాటి
ఘన వీరచరిత నేడు.

అంటూ,నాగమ్మ నేర్చిన విద్యల్ని ఇలా వివరించారు:

శాస్త్రాలన్నీ చరచర నేర్చెను.
కొండల యుద్ధం మెండుగ నేర్చెను
నీటిలో చేపను ఇట్టె కొట్టెను.
వడిసెల యుద్ధం వడిగా నేర్చెను.