పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/343

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఈ విధంగా అనేక విధాలుగా ప్రజల్లో వినిపిస్తున్న విధానాలు భరతుడు నిర్వచించిన కొరవంజి ... యక్షగానాల నుండీ గాంధర్వ గానము లుద్భవించాయని మనం అర్థం చేసుకోవచ్చు. పై ఉదాహరణలను బట్టి మన జంగం కథలు, బుర్ర కథలు, కురవంజి, యక్షగానం మొదలైనవి అనేక దశలను దాటి నేటి సంగీత కళారూపంగా నిలబడిందని చెప్పుకోవచ్చును.

జంగం కథలు ఎప్పటినుండో వస్తున్నా జంగం చరిత్ర కథలనేవి ఇటీవలనే రచింప బడినాయనీ ఇవి ఒక పోషకుని కోరిక మీద వ్రాయబడి అతనికి గాని మరొకనికి గాని అంకిత మీయ బడతాయని అటువంటి జంగం కథా రచయితలు కొందురున్నారనీ వారి కాలాన్ని గురించి వారు రచించిన జంగం కథలను గురించి ..... టేకుమళ్ళ కామేశ్వర రావు గారు కొంత కాలం క్రితం ఆంధ్ర మహిళ పత్రికలో వివరించారు.

జంగం కథలు, కొందరు రచయితలు ధేనువుకొండ వెంకయామాత్యుడు:

ధేనువుకొండ వెంకయామాత్యుడు 1890 ప్రాంతానికి చెందిన వారు. ఒంగోలు తాలూకా గార్లపాడు గ్రామస్తులు. ధేనువు కొండ పిచ్చయ్య గారి పుత్రులు. ఈయన విరాటపర్వం అనే జంగం కథను రచించి ఆ వూరి విష్ణు దేవునికి అంకితమిచ్చారు. ఈయన యక్షగానాల్ని రక్షించినట్లు పీఠికలో వ్రాసుకున్నారు.

వీరు ఉషా పరిణయం, మైరావణ చరిత్ర ... విరాటపర్వం ... ఉత్తర గోగ్రహం, దక్షిణ గోగ్రహణం, కీచక వధ... వామన చరిత్ర ...ప్రత్యేకంగా వ్రాశారు. యక్షగాన కవిత్వంలో ఆయనకు ఆయనే సాటి.

ప్రహ్లద చరిత్ర ...ప్రద్యుమ్న విజయం ...సుందరకాండ ... సీతా కళ్యాణం మొదలైన హరికథలను కూడా రచించారు.