పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/3

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
భూమిక


పద్మభూషణ్
ఆచార్య
డా. సి. నారాయణరెడ్డి


తెలుగు భాషా సాహిత్య కళాసంస్కృతుల సర్వతోముఖ విలసనానికి, వికాసానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ చేసిన చట్ట ప్రకారం 1985 డిసెంబరు 2 వ, తేదీన రూపు దాల్చిన విశిష్ట విద్యాసంస్థ తెలుగు విశ్వవిద్యాలయం.

బోధన, పరిశోధన, ప్రచురణలతో పాటు విస్తరణ సేవ, రాష్ట్రేతరాంద్రులకూ, విదేశాంధ్రులకు సహాయ సహకారాల కల్పన వంటి బహుముఖీన కార్యక్రమాలను కూడ ఈ విశ్వవిద్యాలయం నిర్వహిస్తున్నది.

పూర్వం వున్న అకాడమీలు, తెలుగు భాషాసమితి, అంతర్జాతీయ తెలుగు కేంద్రం, విలీనం కావడంతో విశ్వవిద్యాలయం, వివిధ పీఠాలు, కేంద్రాలు, విభాగాల సమాహారంగా వ్వవహరిస్తున్నది.

తెలుగు జాతి వైభవోన్నతులకు అద్దంపట్టే గ్రంథాల ప్రచురణ విశ్వవిద్యాలయ ప్రధానాశయాల్లో ఒకటి.

విశ్వవిద్యాలయంలో విలీనమైన అప్పటి ఆంధ్ర ప్రదేశ్ సాహిత్య అకాడమి అవిశ్రాంత కృషి ద్వారా దేశ సాహిత్య రంగంలో విశిష్ట స్థానం సమకూర్చుకుంది.

1957 ఆగష్టు 7వ తేదీన ఆంధ్ర ప్రదేశ్ లో ఏర్పాటైన ఈ అకాడమీ దేశం మొత్తంమీద ప్రప్రథమ రాష్ట్ర స్థాయి అకాడమి కావడం విశేషం.

ఈ అకాడమి ప్రామాణికమైన నిఘంటువులు, పదకోశాలు, కావ్యాలు, ప్రబంధాలు, వ్వాసాలు, విమర్శలు, కల్పనా సాహిత్యం, పరిశోధనాత్మక గ్రంధాలు, జీవిత చరిత్రలు, అనువాదాలు మొదలైనవి 163 గ్రంథాలు ప్రచురించింది.