పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/228

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
భామాకలాపంలో -భామవాచిక విధానం:

భామాకలాపంలో కథ యొక్క సందర్భాన్ని బట్టి వచనం నడుస్తూ వుంటుంది. సత్యభామ ఒక్కతే __ ఏకపాత్రధారి. ప్రక్కనున్న విధూషకుడు తా నొక్కడే, అవసరాన్ని బట్టి పురుష హాస్యగాని వలెను, మాధవి అనే స్త్రీ పాత్ర ధారిగాను రెండందాలా నిర్వహిస్తాడు. ఉదాహరణకు భామాకలాపంలో సత్యభామ వాచికం చూడండి:

ఓయమ్మా:

ఓ యమ్మా, వకావకనాడు పడక మందిరంలో హంసతూలికా తల్పమందు కాకేళి గృహములయందు వజ్ర వైడూర్య గోమేధిక వుష్యరాగ మరకత మాణిక్యములు స్థాపించి నటువంటి నగరి యందు పవళించి యుండగా, స్వామి వారు వచ్చి శయ్యమీద కూర్చునారమ్మా, లేచి పరిమళ ద్రవ్యములు మొదలైన చందన గోష్టి చేసినానే, అంతట స్వామి వారు పరున్నారే, నేను కూర్చున్నానే, పాద సేవ చేసినానే. అప్పుడు స్వామి వారు నన్ను తొడపై కూర్చుండ బెట్టుకుని అమూల్యమైనటువంటి ఆభరణములు అలంకరించి నిలువుటద్దం తెచ్చి ఎదుట నుంచి నీడలు చూసి, సత్యభామా!నీవే చక్కని దానవా, నేనే చక్కని వాడనా? అని అడిగేనే, వోశమ్మా అడిగేటంతవరకు, ఆడబుద్ధి గనుక, తెలియక, నేనే చక్కని దానినంటినే వోశమ్మా, అంతట స్వామి వారు నామీద కోపంచేసి దిగ్గున లేచి చక్కా పోయెనే వోశమ్మా! మన స్వామివారు ఎందు బోయెనో, యెక్కడ బోయెనో వెదుకుతారటే వోశమ్మా!

అంటూ మాధవితో ఎంతో అద్భుతంగా వాచికాభినయం నడుస్తుంది. ఇది వినడానికి ఆహ్లాదకరమైన వాచిక విధానం.

భామా కలాపాన్ని కూచిపూడివారు ఒకమహాకావ్యంగా తీచి దిద్దారు. ఏండ్ల తరబడి ప్రదర్శించి ప్రజా హృదయాలను చూరగొన్నారు. దీని తరువాత వారి ప్రదర్శనాల్లో ముఖ్యమైంది గొల్లకాలాపం.