పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/195

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రామాయణ గాథలకు సంబంధించిన, బొమ్మలాట ప్రదర్శనాలను భారత దేశమంతటా ప్రదర్శించారు.

తోట రంగారావు:

మాధవ పట్నానికి చెందిన తోట రంగారావు, పద్మనిలయ చర్మ చిత్రకళా సంస్థను ఏర్పాటు చేసి ప్రదర్శనాల నిస్తున్నారు. మహాభారత గాథల్ని, బొంబాయి లాంటి ముఖ్యపట్టణాలలోనూ, ఆకాశవాణి లోను ప్రదర్శస్నలు ఇచ్చారు.

తోట వెంకటరావు:

తూర్పు గోదావరి జిల్ల తాళ్ళ పాలెంకు చెందిన తోట వెంకటరావు, తూర్పు , పశ్చిమ గోదావరి జిల్లాలలోనూ, విశాఖ జిల్లాలోను, ఆలిండియా రేడియోలోను నూట ఇరవై బొమ్మలతో పది మంది కళాకారులతో రామాయణ, భారతాధి కథలను ప్రదర్శిస్తున్నారు.