పుట:TeluguSasanalu.pdf/81

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

12. పణ్డరంగుని అద్దంకి శాసనము.

(శ.సం. 770 ప్రాంతము.)

మొట్టమొదట తెలుగులో గణయుక్తముగ వ్రాయబడిన పద్యము అద్దంకి శాసనమని కీర్తిశేషులు శ్రీ కొమర్రాజు లక్ష్మణరావుగారు గుర్తించి ప్రకటించి యుండిరి (ఇపి. ఇండి. IX పుటలు 271-275). ఇది తూర్పు చాళుక్య రాజగు గుణగ విజయాదిత్యుడు పట్టాభిషేకమైన మొదటి సంవత్సరమును జెప్పుచున్నది కనుక నిది సుమారు క్రీ. 844 ప్రాంతమునకు జెందిన రచన గావచ్చునని వారు నిర్ణయించిరి. ఆ మొదటి యేడు పండరంగుడను నాతడు సేనాధిపతిగ పట్టము గట్టబడెననియు, రాజుచే పంపబడి సమస్త సేనతో పణ్డ్రెణ్డు బోయ కొట్టములను వశము చేసుకొని కట్టెపు దుర్గమును తెరపించి కన్దుకూరు (నగరము)ను బెజవాడతో సమానముగ చేసెననియు ఇందు జెప్పబడెను. వేరు విధముగగూడ కొందరు చెప్పిరి.