Jump to content

పుట:Tatwamula vivaramu.pdf/67

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

 4) మూడు నదులు కలియుచోటు తెలియమన్నాడే
మూటిలోయుండే మూల పురుషుని చూడమన్నాడే || శ్రీ గురు ||


వివరము :- విశ్వమంత వ్యాపించియున్నవి రెండే రెండు అవియే ప్రకృతి పురుషుడు అని అంటాము. ప్రకృతికి మారు పేరు మాయ అని కూడ కలదు. అలాగే పురుషున్ని దేవుడు అని కూడ అనుచున్నాము దేవుడు పుట్టించినదే మాయ. దేవుని ఆజ్ఞప్రకారము నడుచుకొనునదే మాయ. తనకు వ్యతిరేఖముగ వ్యవహరించమని దేవుడు మాయను ఆజ్ఞాపించాడు. కావున మాయ ఎప్పటికి దైవమార్గమునకు వ్యతిరేఖమే. ఒక విధానములో మాయను భార్య అని, దేవున్ని భర్త అని చెప్పవచ్చును. భర్త అయిన దేవునికి తన భార్య అయిన మాయ యొక్క వివరమంతయు తెలియును. కావున మాయ వివరము తెలియజెప్పవలయునంటే అది దేవునికొక్కనికే సాధ్యము. దేవుడు తన శక్తిలో కొంత భాగమును భూమి విూద మనిషిగ తన ప్రతినిధిగ పుట్టించును. అతనినే గురువు అంటున్నాము. భూమిమీద దేవుని అవతారము తప్ప ఎవరు గురువగుటకు అర్హులు కారు. దేవుని అంశ అయిన గురువు తనను విశ్వసించిన వారికి మాయ యొక్క మర్మము తెలుపును. అలా మాయ యొక్క మర్మము తెలిసిన వారు తామరాకు నీటిలో ఉన్నప్పటికి తేమ అంటనట్లు మాయలో ఉన్నప్పటికి కర్మ అంటని వారైవుందురు. అందువలన ఈ తత్త్వములో మొదటనే శ్రీగురు రాయుడు మాయమర్మము తెలిసినాడే మాయలో ఉంటూ లేనివాడు కమ్మన్నాడే అన్నారు.


 1) ఆరును ద్రుంచి ఆరును నరకమన్నాడే
ఆరును ఆరును చేరక ఉండమన్నాడే || శ్రీ గురు ||