పుట:Tatwamula vivaramu.pdf/65

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

జ్ఞానము అను మంత్రోపదేశము ద్వార తెలియవచ్చును. జ్ఞానమును తెలియజేయు గురువు దగ్గర ఆత్మను తెలియుటకు అడిగిన విధానమే పై చరణములోని పామును పట్టే విధము తెలియని మాకు పామును పట్టే కట్టు మంత్రము తెలుపమని కోరితిమి అన్నారు.

-***-


-------------10. పద్య తత్త్వము-------------


ఆదిద్యయంబు వృక్షంబు
విూదట రెండక్షరములు మేధినిచరితా
ఆదియు అంత్యము కూడిన
వేదాంతం దీని తెలియు వేద వేద్యుల్‌

వివరము :- మన శరీరములో ప్రతి ఒక్కరికి శ్వాస ఆడుచున్నది. శ్వాసను బట్టి ప్రాణమున్నదని లేదని చెప్పవచ్చును. కావున శ్వాసను ప్రాణము అన్నారు. అనగ గాలి అని అర్థము మన శరీరములో ఐదు రకముల గాలులు గలవు. అవి వరుసగ వ్యాన, ఉదాన, సమాన, ప్రాణ, అపాణ వాయువులంటాము. వాటినే పంచప్రాణములని కూడ అనుచున్నాము. వీటిలో ప్రాణవాయువు శరీరములో ఊపిరితిత్తులనుండి ముక్కురంద్రముల వరకు వ్యాపించివున్నది. ప్రాణవాయువు రెండు ఊపిరితిత్తుల నుండి ముక్కురంధ్రముల ద్వార బయటికి లోపలికి చలించుచున్నది. మనిషి పుట్టుకలో బయటినుండి శ్వాస లోపలికి ప్రవేశిస్తున్నది, చావులో లోపలి నుండి బయటికి వెళ్లిపోవుచున్నది. శ్వాస బయటినుండి పోయిన, లోపలినుండి బయటికి వచ్చిన రెండుగానే బయలుదేరుచున్నది. రెండు ఊపిరితిత్తులనుండి బయలుదేరిన శ్వాస రెండు చీలికలుగానే బయటికి వస్తున్నది. కావున శ్వాసను వృక్షముగ పోల్చి, మొదలులో రెండుకొమ్మలు