'ఆంధ్రబాలగంధర్వ, "పౌరణిక నాటక చక్రవర్తి షణ్ముఖి అంజనేయరాజు(1928-1997) అంజనేయురాజు తూ.గో జిల్లా అనపర్తిలో డిసెంబర్ 1 న జన్మించారు. నారాయణమ్మ రంగ A రాజులు తల్లిదండ్రులు. తండ్రిగారు నాటకరంగంలో ఉండడంతో, చిన్నతనం నుంచే వీరికి నాటకరంగంపై *|ఆసక్తికలిగింది. గుంటురు జిల్లా మోదుకురులో పెరిగిన y షణ్ముఖి, 1940 సం|| ప్రాంతంలోనే ప్రథమ రంగస్థల నాటక ప్రదర్శనను ఇచ్చారు. శ్రీకృష్ణరాయబారములోని జో సహదేవుని పాత్రద్వారా రంగస్థలానికి వీరు పరిచయ మయ్యారు. నక్షత్రకుడు, విజయ రామరాజు, నారదుడు, రాముడు. ఇలా అనేక పాత్రలలో షణ్ముఖికి స్పష్టమైన ముద్రనువేసి, జనంతో భేష్ అనిపించు కున్నారు. షణ్ముఖికి ముఖ్యంగా కురుక్షేత్రంలో å కృష్ణుని పాత్ర చిరకాల యశస్సును తెచ్చిపెట్టింది. శ్రీకృష్ణుడి పాత్రలో ఆయన అనితరసాధ్యమైన ప్రతిభను కనబరిచేవారు. ఆ పాత్ర పోషణలో అనన్య సామన్యమైన ప్రజ్ఞ వీరిది. ఆనాటి రోజులలో ಜಮೀ೩) హిరోల సినిమాలు విడుదల గురించి ప్రేక్షక లోకం ఎంతగా తపించేవారో, ఆంజనేయరాజుగారి నాటకానికి అదే స్థాయిలో నిరీక్షించేవారు. ఆనాడు నాటకం పూర్తికావడానికి, సుదీర్ఘకాలం పట్టేది. 89ODONOP | ప్రేక్షకులు ఎలాంటి విసుగుచెందకుండా రంగస్థలంపై వీరిపాత్ర పోషణను | చూడటానికి తహతహలాడేవారు. షణ్ముఖి పాత్ర వచ్చేంతవరకూ వేచి ఉండడం, నాటకం పూర్తి అయ్యేవరకు ఇంటిముఖం పట్టకపోవడం ఆనాటి ప్రేక్షకుల రసజ్ఞతకు అద్దంపడుతుంది. షణ్ముఖివారి గొంతునుండి చెలియా చెల్లకో పద్యం| వినబడినంతనే ప్రేక్షకులు ముగ్గులయ్యే వారు. కరతాళధ్వనులతో తమ హరం | వ్యక్తం చేసేవారు. ఒన్స్మోర్ అభ్యర్థనలతో, ఈలలతో, చప్పట్లతో నాటకప్రాంగణ మంతా దద్దరిల్లి పోయేది. ప్రజలు వీరి నాటకానికి నీరాజనాలుపడుతూ పాత్ర పోషణకు ఎంతో ప్రభావితులయ్యేవారు. ఆంజనేయరాజు తణుకులో 1948 సం||లో 'బాలత్రిపుర సుందరి నాటక సమాజాన్ని స్థాపించి, దేశవిదేశాలల్లో 15 వేల ప్రదర్శనలు ఇచ్చారు. ఆనాటి రంగస్థల ప్రముఖులు మోదుకూరి సుబ్బారావు, వేమూరి జగ్గయ్య, అబ్బూరి వరప్రసాదరావు, మాదవ పెద్ది వెంకట్రామయ్య పి.సూరిబాబు,
పుట:Tanuku Talukulu -Kanuri Badarinath 2016-08-13.pdf/89
స్వరూపం