పుట:TALANKA-NANDINI-PARINAYAMU.pdf/82

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమాశ్వాసము 11


సర్వచార్వాకముఖమతదుర్వహోగ్ర
గర్వహరులు మఱింగంటి పూర్వగురులు.

38


క.

ఆ మహనీయాన్వయజనుఁ
డై మహదంశమున భావనాచార్యుఁ డనం
గా మహిని వెలసె మత్ప్రపి
తామహుఁ డనవరతసుగుణతామహిమ నొగిన్.

39


సీ.

తనదువాక్ప్రౌఢసిద్ధాంతసూక్తులు జగ
    ద్గురునకు వజ్రపంజరము లయ్యె
తనురచించిన ప్రబంధకథాసుధానిధుల్
    దాస్యకోటికి భాగ్యధనము లయ్యె
తనుజేయు సంతతదానధారాసుధల్
    పండితాళికి మెట్టపంట లయ్యె
తనయశశ్చంద్రికాధవళరుక్తతి ధరా
    తరుణికైశికపుష్పదామ మయ్యె


గీ.

తనదు జిహ్వాంచలంబు వాగ్వనిత కెపుడు
మంగళోత్తుంగమణినృత్తరంగ మయ్యె
ననఁగ జెలువొందె విమతసంహతివిదారి
జనమనోహారి భావనాచార్యసూరి.

40


తే.

అట్టికోవిదునకు కూర్మిపట్టి యగుచుఁ
బుట్టి సిరిజట్టిగొను జగజెట్టి మహిమ
లుట్టిపడ చెట్టవిమతులబట్టి మట్టె
దిట్టయగునట్టి నరసింహదేశికుండు.

41


క.

దురితౌఘదూరితుండను
బిరుదాంకుఁడు- వాదిమతవిభేదుండగు నూ
నరసింహార్యులు సాక్షా
న్నరసింహులుగాక దలఁప నరమాత్రుండే.

42