పుట:TALANKA-NANDINI-PARINAYAMU.pdf/439

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

384

తాలాంకనందినీపరిణయము


శ్రీలం జెంది త్రయోదశాబ్దముల బాఱిం దేరి సౌభద్రు ను
త్రాలప్రక్రియ తల్లితో మగుడ నింద్రప్రస్థముం జేర్చియున్.

230


చ.

కొడుకును కోడలిం గని యకుంఠకుతూహలు లౌచు నక్కులం
దిడుకొని ధర్మజప్రముఖు లెంతయుఁ దాము వివాహకాలమం
డెడపడయుంటచే మది నొకింతఁ గొఱంతను నుత్తరాసతిం
దడయక పెండ్లి సేయఁగను దానికి గల్గె పరీక్షితీశుఁడున్.

231


క.

ఆతఁడె భవజ్జనకుండై
యతులితభరతాన్వయంబు నలఱించెను ద
త్ప్రతినిధివి నీవు నిఖిల
క్షితిపాలనజేయు సుప్రసిద్ధుఁడవు గదా!

232


క.

ఆయావృత్తాంతము వాక్
శ్రీయుక్తి సవిస్తరముగఁ జెప్పితి మునుపే
వేయువిధంబుల నీమది
నేయెడ మఱుపొందునే మహీతలనాథా!

233


క.

ఈపగిదిం జనమేజయ
భూపతికిం బైలుఁ డమృతపుంజరసోక్తుల్
జూపట్టఁ దెలిపి తత్పతి
చే పూజితుఁడై నిజేచ్ఛచే జనుదెంచెన్.

234

ఫలశ్రుతి

క.

శేషాద్రినాథభక్తిమ
నీషం దాలాంకనందినీపరిణయముం
భాషించిన విని వ్రాసిన
దోషములఁ దొలంగి ముక్తి తుది లభియించున్.

235