పుట:TALANKA-NANDINI-PARINAYAMU.pdf/432

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

షష్ఠాశ్వాసము

377


సీ.

గడెలెన్ని యాయెనో గనివచ్చెద నటంచుఁ
        దలుపు గిఱ్ఱునదీసి దాటె నొకతె
పోయిన చెలిరాకపోయెఁ బిల్చెదనంచు
        సతుల నిట్టటుఁ ద్రోసి జారె నొకతె
కుంకుమబరణి గైకొన నే మరిచితి నిదె
        తెచ్చెదనంచు నేతెంచె నొకతె
నెలఁత యెచ్చటికేఁగె నే బోయెద నటంచు
        దాని వెన్కకు నెట్టి దాటె నొకతె


గీ.

సకియ లొక్కొకపేరు బెట్టుకొని పోవు
నంతవారలతోడనే కొంత సిగ్గు
జనుట సన్న లెఱింగి యాసరసమౌళి
చెంత రాదీసి విడె మిచ్చు నంతలోన.

208


క.

దంతఁపుఁ దలుపు తటాలున
నింతులు గికురించి మూసి యిట్టటు కెళవు
ల్కొంతవడి బొంచి కని యే
కాంతసమయ మగుట తూర్ణగతి జని రంతన్.

209


గీ.

కాంతుఁ డంతంత తాల్మి యొక్కింతలేక
నించువి ల్వంచి యిరువురఁ గాంచి పొంచి
నారి నెక్కించి కుప్పించి బీరమెంచి
సూటి బాటించి ఱొమ్మున నాట నేసె.

210


గీ.

కాంతుఁ డపుడు కుచాగ్రదుర్గముల నంటి
మధ్యదేశంబునం గల మర్మము గన
కాఁగల దిదేమొ వలరాజు కయ్య మనుచు
వరజఘనభూమి గడగడ వణకదొణఁగె.

211