పుట:TALANKA-NANDINI-PARINAYAMU.pdf/422

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

షష్ఠాశ్వాసము

367


రమణీమణి గళమున ను
త్తమమంగళసూత్రమును హితంబున గట్టెన్.

166


చ.

చెలియపదంబు రాజకులశేఖరుఁ డాత్మకరాంబుజంబున
న్మెలకువ బూని సన్నెకలుమీఁదను సప్తపదంబు లుంచఁగా
నలఘుగతి న్నడంపె పొలయల్కల దీర్చెడినాటి కిట్లనే
యలవడునంచు వావిగల యంగనలెల్ల హసించి పల్కఁగాన్.

167


మ.

ధరణీదేవసువాసిను ల్ధవళగీతధ్యానము ల్సేయుచో
కరకంజంబుల నాణేముత్తెముల[1] చొక్కంబౌ తలంబ్రాల ప
ళ్ళెరముం బూనుక నీవలావల గుబాళింపంగ దోయిళ్ల నిం
పి రయం బొప్ప తెర న్సడల్చి ఫలితప్రీతి న్విలోకింపఁగన్.

168


చ.

సలలితబాహుమూలరుచి జగ్గులు నిగ్గులు దేర గబ్బిగు
బ్బలపొగ రుబ్బి గుబ్బతిల భామ యొకించుక నిక్కి నిక్కి క
న్గలువల సిగ్గు వెగ్గలముగా పతిపై తలఁబ్రాలు వోసె మం
జులకరకంకణక్వణవిశుద్ధనినాదవినోదలీలలన్.

169


గీ.

ఆణిముత్యాల తలఁబ్రాల నతివమౌళిఁ
బ్రియుఁడు దోయిట ముంచి కుప్పించి నించె
భ్రమరములు డొల్చు కుందకుట్మముల భాతి
మెఱుఁగుక్రొమ్ముడి దొఱుఁగుట లెఱుకపఱప.

170


క.

వైవాహికమౌహూర్తిక
మీవిధి నెరవేర్చి ధౌమ్యహితగతి విప్రుల్
దీవింపుచు శుభవేది వ
ధూవరులం జేర్చి రఖిలతూర్యము లొలయన్.

171
  1. చొక్కొటంపు తల్బ్రాలు ‘తా’