పుట:TALANKA-NANDINI-PARINAYAMU.pdf/412

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

షష్ఠాశ్వాసము

357


తే.

తరళదృశపెన్నెఱుల కప్పుటిరుల గెరలి
తేటగాటంపుగొజ్జంగినీటివాన
గురియుచో నంగదేశంబు నెరయ గ్రమ్మి
బొడ్డుబొడ్డెన బావి యుప్పొంగి పొరలె.

128


క.

అత్తఱి నొకబిత్తఱి తడి
యొత్తుచు పావడ సడల్చె నొయ్యన తనలో
హత్తిన క్రొత్తని సిగ్గున
జిత్తము తత్తఱిలుచున్న సీమంతినికిన్.

129


తే.

జలరుహానన కీరితి జలకమార్చి
చలువవలువల తడినొత్తి సంభ్రమింపఁ
బ్రేమ సౌవర్ణమణిమయపీఠమునను
జల గడిగినట్టి ముత్తెమువలెనె నిలిచె.

130


క.

తలనీరార్చుచు కురులం
జెలు వలరఁగ దువ్వి జారుసిక వేసిన న
క్కలకంఠకంఠి మధులి
ట్కలితలలితకిసలయానుగతలతవోలెన్.

131


క.

ఒకనీరజాక్షి నవచం
పకదామము సికను ముడిచి బాటింప చక
చ్చకితతటిదావృతబలా
హకమాలికభంగి రమ్యమై భాసిల్లెన్.

132


సీ.

ఈపద్మలోచన హిత మెఱింగి యొసంగు
        కలికిరో యుదయరాగంపుచీర
యీమానినీరత్న మామోద మౌనట్లు
        హేమభూషణములు నిడవె తరుణి
యీసైకతశ్రోణి కిష్టమైయున్నట్టి
        గురుహంసతతు లొసంగుమి శుభాంగి